మెగా ఫ్యాన్స్ ప్రతి సందర్బంలో కూడా సేవా కార్యక్రమాలు చేయడంలో ముందు ఉంటాడు.కరోనా లాక్ డౌన్ సమయంలో కూడా వారు చేస్తున్న సేవా కార్యక్రమాలు అన్నీ ఇన్నీ కావు.
ఆక్సీజన్ అవసరం ఉన్న వారి నుండి మొదలుకుని ప్లాస్మా అవసరం ఉన్న వారి వరకు ఎన్నో వందల మందికి మెగా ఫ్యాన్స్ బాసటగా నిలిచారు.పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తున్న మెగా ఫ్యాన్స్ కోసం మెగా హీరోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలిజేస్తూ వస్తున్నారు.
చిరంజీవి మరియు రామ్ చరణ్ లు పలు సందర్బాల్లో అభిమానులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి.మరో సారి చరణ్ అభిమానులను ఉద్దేశించి ఒక లేఖను రాశాడు.
అందులో వారికి కృతజ్ఞతలు తెలియజేశాడు.
ఈ సమయంలో వారు చేస్తున్న కార్యక్రమాలు ఎప్పటికి మర్చి పోలేను.
ప్రతి ఒక్కరు కూడా ఈ సమయంలో సమాజ సేవ కోసం చేస్తున్న పనులు నిజంగా అభినందనీయం అంటూ చరణ్ అన్నాడు.చరణ్ లేఖ తో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
రామ్ చరణ్ లేఖ తో అభిమానులు ఫిదా అవుతున్నారు.ఇక చరణ్ సినిమా ల విషయానికి వస్తే ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమా చివరి షెడ్యూల్ కోసం సిద్దం అవుతున్నాడు.
ఇక ఆచార్య షూటింగ్ లో కూడా చరణ్ వారం నుండి పది రోజుల పాటు పాల్గొనాల్సి ఉంది.ఈ రెండు సినిమా లు కాకుండా శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో ఒక సినిమా కూడా పట్టాలెక్కించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఈ మూడు సినిమా లు కూడా బ్యాక్ టు బ్యాక్ వచ్చే అవకాశం ఉంది.మరో వైపు తండ్రి ఆచార్య సినిమా ను కూడా చరణ్ నిర్మిస్తున్న విషయం తెల్సిందే.
పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టి చిరంజీవి తో మరిన్ని సినిమా లను కూడా నిర్మించేందుకు సిద్దం అవుతున్నాడు.