ఏడాది పూర్తి చేసుకున్న సైరా.. చరణ్ థ్యాంక్స్!

మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రెస్టీజియస్ పీరియాడికల్ మూవీ ‘సైరా నరసింహారెడ్డి’ ఎలాంటి భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యిందో అందరికీ తెలిసిందే.తొలి స్వాతంత్ర్య సమరయోధుడిగా పేరొందిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాధను ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు చూపించాలని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భావించాడు.

 Ram Charan Thanks On Sye Raa 1 Year, Ram Charan, Sye Raa, Chiranjeevi, Nayanthar-TeluguStop.com

దీంతో ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో దర్శకుడు సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో ఈ సినిమాను తెరకెక్కించారు.ఇక గతేడాది అక్టోబర్ 2న ఈ సినిమా రిలీజ్ అయ్యింది.

చిరంజీవి లీడ్ రోల్‌లో నటించిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతి బాబు, నయనతార, తమన్నా వంటి భారీ క్యాస్టింగ్ ఉన్నారు.దీంతో ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా పలు భాషల్లో రిలీజ్ చేశారు.

ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా వసూళ్ల పరంగా కూడా అదిరిపోయే కలెక్షన్లు రాబట్టింది.ఈ సినిమా రిలీజ్ అయ్యి నేటికి ఏడాది పూర్తయిన సందర్భంగా చిత్ర నిర్మాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాకు సంబంధించి ఒక ట్వీట్ చేశాడు.

ఇలాంటి ప్రెస్టీజియస్ మూవీని నిర్మించే అవకాశం తనకు లభించినందుకు ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

ఇక ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్క ఆర్టిస్టుకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా సైరా సినిమా తనకు చాలా స్పెషల్ అని చెప్పిన చరణ్, ఈ సినిమాకు సంబంధించిన కొన్ని స్టిల్స్ వీడియోను పోస్ట్ చేశాడు.కాగా రామ్ చరణ్ ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న ఆచార్య చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

ఈ సినిమాలో ఓ కేమియో పాత్రలో చరణ్ నటిస్తున్నాడు.ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్ట్ చేస్తుండగా అందాల భామ కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది.

మరి ఈ సినిమాతో చిరు ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube