మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నాడు.రాజమౌళి ప్రస్తుతం ఎన్టీఆర్ ల మధ్య భారీ యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరిస్తున్నాడు.
మరోవైపు ఆచార్య చిత్రంలో రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.చిరంజీవి హీరోగా కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.
ఈ చిత్ర యూనిట్ ఇప్పటికే చరణ్ ఆచార్య షూటింగ్ సెట్ లో పాల్గొంటున్నట్లుగా ఆయన ప్రీ లుక్ ను విడుదల చేశారు.
మెగా, సినీ అభిమానుల నుండి విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది.
తాజా సమాచారం మేరకు ఆచార్య లో చరణ్ పాత్ర కు సంబందించిన షూటింగ్ పూర్తి అయినట్లుగా సోషల్ మీడియా లో కథనాలు వస్తున్నాయి.అతి తక్కువ సమయమలోనే దర్శకుడు ఈ కీలక పాత్రకు సంబందించిన పోర్షన్ షూట్ ను పూర్తి చేసినట్లుగా తెలుస్తుంది.
ఆచార్య కు చరణ్ పాత్ర హైలెట్ అవ్వుతుందని చిత్ర యూనిట్ చెబుతుంది.మెగాస్టార్ చిరంజీవికి శిష్యుడుగా చరణ్ ఈ చిత్రంలో నటిస్తున్నాడు.కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయక పాత్రలో నటిస్తుంది.చరణ్ కి జోడీగా ఓ ప్రముఖ హీరోయిన్ నటించనున్నది.త్వరలోనే ఆ విషయంను అధికారికంగా చిత్రా బృందం ప్రకటించనున్నది.
ఈ చిత్రాన్ని సమ్మర్ లో విడుదల చెయ్యడానికి దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలోనే చరణ్ మలయాళం మూవీ లూసిఫర్ ను ఆయన నిర్మాణంలో తెలుగులో రీమేక్ చేస్తున్నాడు.
ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ ఫైనల్ యాక్షన్ ఎపిసోడ్ ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు.
.