మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డైరెక్టర్ శంకర్ కాంబోలో ఒక సినిమా చేయబోతున్నట్టు ఇప్పటికే అధికారిక ప్రకటన వెలువడింది.శంకర్ సినిమాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
అందుకే ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుండి ఈ సినిమాపై అంచనాలు ఒక రేంజ్ లో పెరిగాయి.శంకర్ డైరెక్ట్ తెలుగు సినిమా చేయాలనీ ఎప్పటి నుండో ప్రయత్నిస్తున్న ఇప్పటికి రామ్ చరణ్ సినిమాతో డైరెక్ట్ తెలుగు సినిమా చేయబోతున్నాడు.
ఈ సినిమాను దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మించ బోతున్నారు.ఈ సినిమా అలా అనౌన్స్ చేసారో లేదో అప్పటి నుండి ఏదో ఒక గాసిప్ వస్తూనే ఉంది.
ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ సినిమాను సెప్టెంబర్ రెండో వారం నుండి సెట్స్ మీదకు తీసుకు వెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు.ప్రస్తుతం రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో ”ఆర్ఆర్ఆర్” సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చివరి దశకు చేరుకుంది.ఆగస్టు రెండో వరం కల్లా ఈ సినిమా షూటింగ్ పూర్తి అవ్వబోతుంది.అందుకే #RC15 సినిమాను సెప్టెంబర్ రెండో వారం నుండి సెట్స్ మీదకు తీసుకెళ్ళ బోతున్నారని తెలుస్తుంది.ఈ సినిమాను శంకర్ తనదైన స్టైల్ లో డైరెక్ట్ చేయబోతున్నాడట.
పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ చీఫ్ మినిస్టర్ గా నటిస్తున్నాడని టాక్.
ఇంతకు ముందు శంకర్ డైరెక్ట్ చేసిన ఒకే ఒక్కడు సినిమా తరహాలోనే ఈ సినిమా కూడా ఉండబోతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.ఈ సినిమా కోసం ఇప్పటికే నటీనటుల ఎంపిక జరుగుతుందట.ఎస్ ఎస్ థమన్ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నాడు.
త్వరలోనే మిగతా యాక్టర్స్ వివరాలు అధికారికంగా ప్రకటించ నున్నారని తెలుస్తుంది.ఈ సినిమాను 2022 సమ్మర్ కు రెడీ చేయబోతున్నారట.
మరి శంకర్ అనుకున్న సమయానికి పూర్తి చేస్తాడో లేక ఏవైనా అవరోధాలు వచ్చి లేట్ చేస్తాడో వేచి చూడాల్సిందే.