మెగా పవర్ స్టార్ రాం చరణ్ సినిమాల లైనప్ సూపర్ గా ఉంది.RRR, ఆచార్య సినిమాలను పూర్తి చేసిన చరణ్ నెక్స్ట్ సినిమా శంకర్ డైరక్షన్ లో చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు.భారీ బడ్జెట్ మూవీగా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది.
ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ఈ సినిమాలోని ఒక సాంగ్ కోసం చరణ్ ఏకంగా 80 మంది డ్యాన్సర్స్ తో డ్యాన్స్ చేస్తున్నాడని తెలుస్తుంది.
చరణ్ 80 మంది డ్యాన్సర్స్ తో చేసే డ్యాన్స్ హైలెట్ గా ఉంటుందని అంటున్నారు.
ప్రముఖ కొరియోగ్రాఫర్ ఈ సాంగ్ కు కొరియోగ్రాఫ్ చేస్తున్నారట.తప్పకుండా సినిమాలో ఇదో మేజర్ హైలెట్ అవుతుందని అంటున్నారు.
ఈ సాంగ్ కోసం భారీ బడ్జెట్ కేటాయిస్తున్నట్టు తెలుస్తుంది.చరణ్ తో శంకర్ మొదటిసారి చేస్తున్న ఈ సినిమా తప్పకుండా అంచనాలకు తగినట్టుగానే ఉంటుందని అంటున్నారు.
సినిమాలో సునీల్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నట్టు తెలుస్తుంది. ఐ, 2.0 సినిమాలతో కొద్దిగా వెనకపడ్డ శంకర్ ఈ సినిమాతో సత్తా చాటాలని చూస్తున్నాడు.