శంకర్ చరణ్ కాంబినేషన్ సినిమా షూటింగ్ మొదలుకాకముందే వివాదాల్లో చిక్కుకుంటూ ఉండటం గమనార్హం.భారతీయుడు2 సినిమా షూటింగ్ మధ్యలో ఆగిపోవడం వల్ల చరణ్ శంకర్ కాంబో మూవీకి కొన్ని సమస్యలు ఏర్పడిన సంగతి తెలిసిందే.అయితే ఆ సమస్యలు పరిష్కారమయ్యే సమయానికి శంకర్ చరణ్ కాంబో మూవీ కథ తనదేనంటూ ఒక రచయిత సంచలన ఆరోపణలు చేయడం గమనార్హం.
శంకర్ చరణ్ కాంబో మూవీపై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని తాకాయి.
ఈ సినిమాలో చరణ్ కు జోడీగా కియారా అద్వానీ నటిస్తుండగా సెల్లమత్తు అనే రైటర్ ఈ కథ తనదేనంటూ సంచలన ఆరోపణలు చేశారు.ఈ రచయిత దక్షిణ భారత సినీ రచయితల సంఘాన్ని ఆశ్రయించారు.
సెల్లముత్తు చేసిన ఆరోపణల గురించి విచారణ జరుగుతోంది.విచారణ తర్వాత ఈ ఆరోపణల్లో నిజానిజాలు తెలిసే అవకాశం ఉంటుంది.
గతంలో ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు ఈ సినిమాకు కథ అందించాడని వార్తలు వచ్చాయి.
ఆరోపణలు చేస్తున్న సెల్లముత్తు కార్తీక్ సుబ్బరాజు శిష్యుడు కావడం గమనార్హం.ఈ వివాదం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాల్సి ఉంది.ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్ కానుంది.
ఈ నెల నుంచే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుందని తెలుస్తోంది.శంకర్ వేగంగా ఈ సినిమాను పూర్తి చేయాలని భావిస్తున్నారని సమాచారం.తొలి షెడ్యూల్ లో శంకర్ ఒక పాటను చిత్రీకరించనున్నారని తెలుస్తోంది.పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కనుండగా ఇతర భాషల్లో గుర్తింపును సంపాదించుకున్న నటులను ఈ సినిమా కోసం ఎంపిక చేస్తున్నట్టు తెలుస్తోంది.150 కోట్ల రూపాయలకు పైగా భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.