రామ్ చరణ్.శంకర్ ల కాంబోలో రూపొందుతున్న సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి.
చరణ్ కెరీర్ లో 15వ సినిమా రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ను వచ్చే నెలలో మొదలు పెట్టాలని భావిస్తున్నారు.ఇక ఈ సినిమా చిత్రీకరణ మొదలు పెట్టడానికి ముందు నటీ నటుల ఎంపిక జరుగుతోంది.
పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ సినిమాకు గాను చిన్న పాత్రకు కూడా పెద్ద నటీ నటులను ఎంపిక చేస్తున్నట్లుగా తెలుస్తోంది.ఇటీవల ఈ సినిమాలో హీరోయిన్ గా కియారా అద్వానీని ఎంపిక చేస్తూ అధికారికంగా ప్రటకన వచ్చింది.
ఇదే సినిమాలో మరో హీరోయిన్ అయిన అంజలిని ముఖ్య పాత్రకు గాను ఎంపిక చేశారనే వార్తలు వస్తున్నాయి.ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు మాత్రమే కాకుండా పలువురు స్టార్స్ కూడా ఈ సినిమాలో నటించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
భారీ చిత్రాలకు పెట్టింది పేరు అయిన శంకర్ ఈ సినిమా తో మరో లెవల్ అన్నట్లుగా చరణ్ ను తీసుకు వెళ్లబోతున్నాడు.
ఇక ఈ సినిమాలో మరో కీలక పాత్రకు గాను మలయాళ స్టార్ నటుడు ఫాహద్ ఫాజిల్ ను ఎంపిక చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం రామ్ చరణ్ మరియు ఫాహద్ ఫాజిల్ లు ఈ సినిమాలో ఢీ కొట్టబోతున్నట్లుగా తెలుస్తోంది.వీరిద్దరి కాంబోలో రాబోతున్న సీన్స్ అద్బుతం అన్నట్లుగా ఉంటాయనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం ఫాహద్ ఫాజిల్ నటిస్తూ ఉన్న సినిమా ల జాబిత చాలా పెద్దదే.కమల్ హాసన్ నటిస్తున్న విక్రమ్ సినిమా తో పాటు బాలీవుడ్ లో రెండు సినిమా లు తెలుగు లో పుష్ప సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే.పుష్ప లో ఈయన పాత్ర గురించి ప్రస్తుతం వినిపిస్తున్న వార్తలు ఆయన్ను జాతీయ స్థాయిలో స్టార్ గా నిలపడం ఖాయం అన్నట్లుగా ఉన్నాయి.మొత్తానికి రామ్ చరణ్ శంకర్ ల మూవీలో ఇలాంటి నటీనటులను ఎంపిక చేయడం వల్ల ఆ సినిమా వెయిట్ అమాంతం పెరిగి పోయిందనే చెప్పాలి.