టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్.ఇందులో ఇద్దరు స్టార్ హీరోలు అయిన జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే.
అలాగే ఈ సినిమాలో అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్ లుగా నటించారు.అజయ్ దేవ్ గన్, శ్రీయ, సముద్రఖని తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
ఇక ఈ సినిమా జనవరి 7న విడుదల కావాల్సి ఉండగా అనుకోని విధంగా ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడింది.ఇలా నాలుగోసారి ఈ సినిమా వాయిదా వేయాల్సి వచ్చింది.
ఇది ఇలా ఉంటే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆర్ఆర్ఆర్ సినిమా గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.ఆర్ఆర్ఆర్ ఈ సినిమా తనకు ధైర్యాన్ని ఇచ్చింది అని తెలిపారు రామ్ చరణ్.
రాబోయే రోజుల్లో మరి కొన్ని హిందీ సినిమాలు చేయడానికి ఆర్ఆర్ఆర్ సినిమా తనకు చాలా ధైర్యాన్ని ఇచ్చింది అని చెప్పుకొచ్చారు చెర్రీ.ఈ సినిమా తర్వాత మరిన్ని పాన్ ఇండియా సినిమాలు చేయాలని అనుకుంటున్నాను అని తెలిపాడు.
ఇకపై ప్రేక్షకులు.సినిమాలను, నటీనటులను చూసే విధానాన్ని ఆర్ఆర్ఆర్ పూర్తిగా మార్చేస్తుంది అని పేర్కొన్నారు.
ఇక పోతే రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ఈ కరోనా మహమ్మారి వల్ల ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడింది.అన్ని అనుకున్న విధంగా జరిగి ఉంటే ఈ పాటికి టాలీవుడ్ తో పాటు మిగిలిన ఇండస్ట్రీలలో బాక్సాఫీస్ వద్ద సందడి ఒక రేంజ్ లో ఉండేది.కానీ ఈ కరోనా మహమ్మారి వల్ల తప్పని పరిస్థితులలో సినిమాను 4వ సారి వాయిదా వేయాల్సి వచ్చింది .ఆర్ ఆర్ ఆర్ ఈ సినిమాపై ప్రేక్షకులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు.అంతేకాకుండా జనవరి 7న విడుదల అవుతుంది అని ఎన్నో ఆశలతో ఎదురు చూశారు.కొంతమంది అభిమానులు అయితే థియేటర్ల వద్ద భారీ కటౌట్లతో ఫ్లెక్సీలు కూడా బిగించారు.
కానీ ఈ సినిమా విడుదల తేదీని ఒక్కసారిగా వాయిదా వేయడంతో చెర్రీ ,తారక్ అభిమానులు తీవ్ర నిరాశ చెందారు.చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియన్ సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ ఇంకా జరుగుతోంది.అలాగే త్వరలో గౌతమ్ తిన్ననూరి చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకురాబోతున్నారు.