టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు సోదరుడు శిరీష్ తనయుడు ఆశిష్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా రౌడీ బాయ్స్.శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆశిష్ కు జోడీగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది.
ఈ సినిమాను ఈ సంక్రాంతికి రిలీజ్ చేయబోతుండడంతో ప్రమోషన్స్ కూడా భారీ స్థాయిలో చేస్తున్నారు.
తాజాగా నిన్న రాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.
దీనికి ముఖ్య అతిధులుగా రామ్ చరణ్ కూడా విచ్చేసారు.ఈ వేడుకలో ఆయన ఆర్ ఆర్ ఆర్ సినిమా పోస్ట్ పోన్ గురించి కూడా స్పందించారు.
టాలీవుడ్ లో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న సినిమా ఆర్ఆర్ఆర్( రౌద్రం రణం రుధిరం).రాజమౌళి దర్శకత్వం లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పీరియాడిక్ మూవీ ఇది.
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కింది.నిజానికి ఈ సినిమా జనవరి 7న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని భారీ ప్లాన్ లు వేశారు.
కానీ ఓమిక్రాన్ బాగా విస్తరించు తుండడంతో ఈ సినిమా వాయిదా వేయక తప్పలేదు.మరి ఈ వాయిదా పై చరణ్ రౌడీ బాయ్స్ ఈవెంట్ లో ఆసక్తికరంగా మాట్లాడారు.
మాకు సంక్రాంతి ఎంత ముఖ్యమో తెలియదు కానీ దిల్ రాజు కు మాత్రం చాలా ముఖ్యం.సినిమా పెద్దలు రాజమౌళి, దానయ్య ఉన్నారు సో వాళ్ళు చూసుకుంటారు.మేము మూడేళ్లు ఈ సినిమా కోసం కష్టపడ్డాం సో వేచి చూడడంలో తప్పులేదు.సరైన సమయంలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తాం.అని రామ్ చరణ్ ఈ సినిమా విషయంలో స్పందించారు.