మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా, కియారా అద్వానీ హీరోయిన్ గా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో,ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో అత్యంత భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారనే విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఈ సినిమా RC15 అనే టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటుంది.
ఈ క్రమంలోనే ఈ సినిమా పూజా కార్యక్రమాలను ఎంతో ఘనంగా జరుపుకుని ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేయడంతో ఈ పోస్టర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
ఇకపోతే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ సమాచారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
రామ్ చరణ్ తన 15వ సినిమాను షూటింగ్ పనులు ప్రారంభమయ్యాయని ప్రస్తుతం ఈ సినిమాను పూనేలో అత్యంత భారీ సెట్స్ వేసి అక్కడ చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఈ సినిమా షూటింగ్ కోసం ప్రస్తుతం ముంబైలో ఉన్న రామ్ చరణ్ ముంబై నుంచి పూణే వెళ్లారు.
ఈ షెడ్యూల్ లో భాగంగా రామ్ చరణ్, కియారా పై చిత్రీకరణ జరుగుతున్నట్లు సమాచారం.
ఈ షెడ్యూల్ లో భాగంగా వీరిద్దరిపై ఒక పాటను చిత్రీకరించనున్నారని ఈ పాట సుమారు 15 రోజుల వరకు చిత్రీకరణ జరుపుకోనుందని తెలుస్తోంది.
అయితే స్టార్ ప్రొడ్యూసర్, స్టార్ డైరెక్టర్ కాంబినేషన్ లో స్టార్ హీరో హీరోయిన్లు నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం దిల్ రాజు భారీ బడ్జెట్ ను కేటాయించినట్లు తెలుస్తోంది.
ఇకపోతే చరణ్ కియారా కాంబోలో ఇదివరకే వినయ విధేయ రామ సినిమా వచ్చినప్పటికీ ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.మరి ఈ సినిమా ద్వారా అయినా వీరిద్దరూ విజయం సాధిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.