వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పవర్ స్టార్’ ఎలాంటి వివాదాన్ని క్రియేట్ చేస్తుందో అందరికీ తెలిసిందే.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేస్తూ వర్మ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడంటూ పవన్ అభిమానులు వర్మపై మండి పడుతున్నారు.
కాగా నిన్న ఆయన ఆఫీసుపై పవన్ అభిమానులు దాడి కూడా చేశారు.అయినా తానెవ్వరికీ భయపడనంటూ వర్మ తేల్చి చెప్పడంతో ఈ వివాదం ఎటు వెళ్తుందా అని అందరూ అనుకుంటున్నారు.
అయితే గతకొద్ది రోజులుగా ఈ వివాదం గురించి మీడియాలో అదేపనిగా వార్తలు వస్తుండటంతో ప్రేక్షకులకు చిరాకు లేస్తోంది.కాగా ఇదే విషయాన్ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా తనదైన స్టయిల్లో వ్యక్త పరిచాడు.
తాజాగా సోషల్ మీడియాలో రంగస్థలం చిత్రంలోని ఓ ఫోటోను షేర్ చేస్తూ ‘కేవలం పనికొచ్చే వార్తలే వింటున్నా’ అంటూ పోస్ట్ పెట్టాడు.అనవసరమైన విషయాలను తాను పట్టించుకోనని, అలాంటి వాటికి తాను స్పందించనని చరణ్ ఈ పోస్ట్ ద్వారా తెలిపాడు.
మొత్తానికి వర్మ-పవన్ వివాదంలో మెగా ఫ్యామిలీ నుండి ఎవరూ స్పందించక పోవడంతో ఫ్యాన్స్ ఆందోళనకు గురవుతున్నారు.ఇటీవల మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ వర్మపై ఘాటుగా స్పందించిన సంగతి తెలిసిందే.
పవర్స్టార్ చిత్రాన్ని రిలీజ్ చేయకూడదని పవన్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నా వర్మ మాత్రం ఈ విషయంపై వెనక్కి తగ్గకపోవడంతో ఈ వివాదం ఎటు వెళ్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.మరి చరణ్ పోస్ట్కు వర్మ ఎలాంటి కామెంట్ వేస్తాడో చూడాలి.