సినిమా నటులు సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెట్టిన వాటిని చాలా మంది చూస్తారు.మంచి విషయాలు అయితే ఫాలో అవుతారు.
వారికి ఉన్న చరిష్మా అలాంటిది.అందుకే సోషల్ అవేర్ నెస్ కోసం ప్రభుత్వాలు సెలబ్రిటీలని ఉపయోగించుకుంటూ ఉంటారు.
అప్పుడప్పుడు ఫ్యాన్స్ తో ముచ్చటిస్తూ, అలాగే సొసైటీ గురించి ఆసక్తికరమైన పోస్టులు సెలబ్రిటీలు పెడుతూ ఉంటారు.తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అలాంటి పోస్ట్ ఒకటి ట్విట్టర్ లో పెట్టారు.
ఇప్పుడు అది వైరల్ గా మారింది.రామ్ చరణ్ సోషల్ మీడియాలో పోస్టులు చేయడం చాలా తక్కువ.
ఒక వేళ చేసిన కూడా అవి ఆలోచింపజేసే విధంగా ఉంటాయి.
తాజాగా అలాంటిదే ఓ పోస్టు చేశారు.
హింస లేదా అహింస… మార్గం ఎలాంటిదైనా గానీ ప్రతీకారం కోరుకుంటే ఉన్నచోటే గిరికీలు కొడుతుంటాం తప్ప, ఎదుగుదల ఉండదు అంటూ ప్రముఖ రచయిత్రి ఎడిత్ ఇవా ఈగర్ రాసిన ద చాయిస్ అనే పుస్తకం నుంచి కొన్ని స్ఫూర్తిదాయక వాక్యాలను ప్రస్తావించారు.యూరప్ కు చెందిన ఎడిత్ ఇవా ఈగర్ ప్రముఖ సైకాలజిస్టు.
రెండో ప్రపంచ యుద్ధ కాలంలో యూదులపై నరమేధం కొనసాగినప్పుడు ఆమె కూడా బాధితురాలే.తన జీవిత అనుభవాలతో రాసిన ద చాయిస్ అనే పుస్తకం ఎంతో ప్రజాదరణ పొందింది.
ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా అమ్ముడైన పుస్తకాల్లో ఒకటిగా నిలిచింది.ఇప్పుడీ పుస్తకం నుంచి కొన్ని కొటేషన్లను రామ్ చరణ్ తీసుకున్నారు.
మొత్తానికి పవన్ కళ్యాణ్ తరహాలోనే ఇలాంటి సోషల్ ఎలిమెంట్స్ గురించి తెలుసుకోవడానికి రామ్ చరణ్ కూడా పుస్తకాలు ఎక్కువగా చాడువుతాడని అతను పెట్టిన పోస్ట్ బట్టి అర్ధమవుతుంది.