మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం సైరా నరసింహారెడ్డి.స్వాతంత్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తుండగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు.
భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది.ఇప్పటికే గత ఏడాది మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సైరా నరసింహారెడ్డి ఫస్ట్ లుక్ టీజర్ మెగా ఫ్యాన్స్ నే కాకుండా టాలీవుడ్ ప్రేక్షకులను సైతం విశేషంగా ఆకట్టుకుంది దీంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.
ఇదిలా ఉంటే తాజాగా సాహో మూవీ టీజర్ దేశవ్యాప్తంగా సంచలన రికార్డులు నమోదు చేసింది.ఈ నేపథ్యంలో సైరా నరసింహారెడ్డి సినిమా మీద కూడా అంచనాలు పెంచేందుకు చిత్రయూనిట్ రంగం సిద్ధం చేస్తోంది.
దీనికోసం సినిమా నుంచి ట్రైలర్ ని రిలీజ్ చేయడానికి సిద్ధమవుతోంది.ఇక టాలీవుడ్ లో తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఆగస్టు 22న సైరా నరసింహారెడ్డి ట్రైలర్ మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక అప్పటికే ప్రభాస్ సాహో మూవీ రిలీజ్ అయి ఉంటుంది కాబట్టి సైరా ట్రైలర్ కి మంచి స్పందన వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నట్లు సమాచారం.ప్రస్తుతం సైరా నరసింహారెడ్డి షూటింగ్ చివరి దశలో ఉండడంతో దర్శకుడు సురేందర్ రెడ్డి ట్రైలర్ రిలీజ్ కి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.