మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లెటస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసేందుకు దర్శకుడు రాజమౌళి రెడీ అవుతున్నాడు.
కాగా ఈ సినిమాలో మరో స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు పీక్స్కు చేరుకున్నాయి.ఇక ఈ సినిమాను పూర్తి పీరియాడికల్ చిత్రంగా తెరకెక్కిస్తున్న జక్కన్న ఈ సినిమాను వచ్చే దసరాకు రిలీజ్ చేయాలని భావిస్తున్నాడు.
అయితే ఈ సినిమా కోసం చరణ్ మరే ఇతర ప్రాజెక్టులను ఓకే చేయడం లేదు.దీంతో చరణ్ నెక్ట్స్ చిత్రం ఎవరితో చేస్తాడా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.
కాగా ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ చిత్రాన్ని ఓకే చేసేందుకు చాలా మంది డైరెక్టర్లు చెప్పిన కథలను వింటూ వస్తున్నాడు.కాగా వారిలో కొందరు యంగ్ డైరెక్టర్స్ చెప్పిన కథలు చరణ్కు బాగా నచ్చాయట.
వారిలో దర్శకుడు వెంకీ అట్లూరి, గౌతమ్ తిన్నూరిలు కూడా ఉన్నారు.అయితే వెంకీ అట్లూరి తెరకెక్కించిన భీష్మ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.
కాగా గౌతమ్ తిన్నూరి తెరకెక్కించిన మళ్లీ రావా క్లాసిక్ మూవీగా మంచి గుర్తింపును తెచ్చుకుంది.
దీంతో గౌతమ్ తిన్నూరి చెప్పిన కథ బాగా నచ్చడంతో వెంటనే చరణ్ ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
గౌతమ్ చెప్పిన కథను పూర్తిగా డెవలప్ చేయాల్సిందిగా చరణ్ సూచించాడట.దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ త్వరలోనే రాబోతున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
ఇక తాజాగా చరణ్ కరోనా బారిన పడటంతో ఈ కాంబోకు సంబంధించిన అనౌన్స్మెంట్ ఎప్పుడు ఉంటుందా అని మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.కాగా ఆర్ఆర్ఆర్లో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.