మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది పూరి జగన్నాద్.మొదటి సినిమా చిరుతతో చరణ్కు మంచి మాస్ హీరో ఇమేజ్ను కట్టబెట్టాడు.
ఆ తర్వాత మళ్లీ వీరిద్దరి కాంబో మూవీ వచ్చిందే లేదు.చరణ్ కు చాలా కాలంగా పూరితో సినిమా చేయాలనే ఆసక్తి ఉంది.
ఎందుకంటే తనను హీరోగా పరిచయం చేసిన దర్శకుడితో మరోసారి వర్క్ చేయాలని భావించాడు.కాని పూరి ఆమద్య వరుసగా ఫ్లాప్లే తీయడంతో బాబోయ్ వద్దులే కాస్త దూరంగా ఉండటం బెటర్ అన్నట్లుగా చరణ్ భావించాడు.
ఎట్టకేలకు ఇస్మార్ట్ శంకర్ సినిమాతో పూరి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.దాంతో వరుసగా సినిమాలను ఆయన చేస్తున్నాడు.
లాక్డౌన్ టైమ్లో అయిదు ఆరు కథలను పూరి సిద్దం చేశాడట.అందులో ఒకటి చరణ్ కు బాగా నచ్చిందట.
ఆ కథలో నటించాలని కోరుకుంటున్నాడట.ఆ విషయాన్ని స్వయంగా పూరి వద్ద చరణ్ ఉంచాడనే వార్తలు గుప్పుమంటున్నాయి.
భారీ ఎత్తున అంచనాలున్న విజయ్ దేవరకొండ ఫైటర్ మూవీ ని పూరి చేస్తున్నాడు.ఆ తర్వాత పలువురు హీరోలు ఈయన దర్శకత్వంలో సినిమాను చేసేందుకు రెడీగా ఉన్నారు.అందులో చరణ్ కూడా ఉన్నాడని తెలుస్తోంది.కన్నడ హీరో కేజీఎఫ్ స్టార్ యశ్ కూడా పూరి దర్శకత్వంలో నటించేందుకు సిద్దంగా ఉన్నట్లుగా చెప్పాడు.కనుక ఖచ్చితంగా పూరి తదుపరి సినిమా ఓ రేంజ్లో ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చర్చలు జరిపేందుకు రావాల్సిందిగా పూరిని చరణ్ ఆహ్వానించాడు.
దాంతో ఇద్దరి కాంబోలో మూవీ వచ్చే ఏడాదిలో ప్రారంభం అవుతుందని అంటున్నారు.ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత చరణ్ చేయబోతున్న సినిమా ఏంటీ అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు.
ఆ విషయమై ఇప్పుడు స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.చిరుత వంటి మాస్ మసాలా సినిమా ఇప్పుడు వస్తే తప్పకుండా వంద కోట్ల సినిమా అవుతుందని మెగా ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు.