మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు.ఇందులో రామ్ చరణ్ తో పాటు ఎన్టీఆర్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు.
టాలీవుడ్ లో బిగ్గెస్ట్ మల్టీ స్టార్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తుంటే.రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు.
ఈ సినిమాను డివివి దానయ్య 400 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.ఆర్ ఆర్ ఆర్ సినిమాలో రామ్ చరణ్ సరసన ఆలియా భట్ నటిస్తుంటే.ఎన్టీఆర్ సరసన విదేశీ భామ ఒలీవియా మోరిస్ నటిస్తుంది.అంతేకాదు ఈ సినిమాలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు.
ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతుందని ఇప్పటికే అధికారిక ప్రకటన వెలువడింది.
దిల్ రాజు మొదటిసారి భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.
ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు తీసుకెళ్ళబోతున్నారు.వీటితో పాటు రామ్ చరణ్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలో కూడా కీలకమైన పాత్రలో నటిస్తున్నాడు.ఈ సినిమాలో రామ్ చరణ్ సిద్ధ అనే పవర్ పాత్రలో నటిస్తున్నాడు.
ఇందులో రామ్ చరణ్ కు జోడీగా పూజ హెగ్డే నటిస్తుంది.
అయితే తాజాగా మరొక సినిమాను కూడా లైన్లో పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి.రామ్ చరణ్ సెన్సషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో ఒక సినిమా రాబోతుందని వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి.
ప్రశాంత్ నీల్ డివివి దానయ్య నిర్మాణ సంస్థ తో ఒక సినిమా చేస్తానని ఒప్పుకోగా ఆ సినిమాలో రామ్ చరణ్ నటించ బోతున్నాడని టాక్ నడుస్తుంది.మరి చూడాలి ఈ సెన్సషనల్ ప్రాజెక్ట్ ఓకే అవుతుందో లేదో.