చిరంజీవి, పవన్‌ అన్నారు.. చివరకు ఏం ఫిక్స్‌ చేశారో తెలుసా?

మెగా హీరో వరుణ్‌ తేజ్‌ హీరోగా సంకల్ప్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘అంతరిక్షం’ మూవీ ఈనెల 21న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.స్పేస్‌ సెంటర్‌ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంపై సినీ వర్గాల్లో మరియు ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి.

 Ram Charan Is The Chief Guest For Antariksham Movie-TeluguStop.com

తెలుగులోనే కాకుండా ఈ చిత్రం బాలీవుడ్‌ వారి దృష్టిని కూడా ఆకర్షించింది.దాంతో ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుక భారీ ఎత్తున నిర్వహించాలని నిర్మాత క్రిష్‌ భావించాడు.

మెగా బ్రదర్స్‌ పవన్‌ కళ్యాణ్‌ మరియు చిరంజీవిలు ఈ వేడుకలో పాల్గొంటారు అంటూ వార్తలు వచ్చాయి.

చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌లు ఈ వేడుకలో పాల్గొనడం లేదు అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు క్లారిటీ ఇచ్చారు.ఈ చిత్ర ప్రీ రిలీజ్‌ వేడుకపై చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటన చేశారు.ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను ఈనెల 18న భారీ ఎత్తున నిర్వహించబోతున్నామని, ఈ వేడుకలో రామ్‌ చరణ్‌ స్పెషల్‌ గెస్ట్‌గా పాల్గొనబోతున్నాడు అంటూ ప్రకటన వచ్చింది.

దాంతో పుకార్లన్నింటికి ఫుల్‌ స్టాప్‌ పెట్టినట్లయ్యింది.

చరణ్‌ గతంలో కూడా వరుణ్‌ మూవీస్‌కు గెస్ట్‌గా హాజరు అయ్యాడు.ఆ సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.మరోసారి అదే తరహాలో సక్సెస్‌ను దక్కించుకుంటుందేమో చూడాలి.

ఘాజీ వంటి విభిన్న చిత్రాన్ని తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న దర్శకుడు సంకల్ప్‌ రెడ్డి ఈ చిత్రంను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని మరీ తెరకెక్కించాడు.స్పేస్‌ సెంటర్‌లోని సీన్స్‌ ఇప్పటి వరకు ఇండిన్‌ స్క్రీన్‌ మీద వచ్చి ఉండవు అంటున్నారు.వరుణ్‌ తేజ్‌ సైంటిస్ట్‌గా కనిపించబోతున్నాడు.ఇక ఈ చిత్రంలో హీరోయిన్స్‌గా లావణ్య త్రిపాఠి మరియు అదితి రావు హైందరిలు నటించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube