సందీప్ కిషన్ బీరువా, ధనుష్ రఘువరన్ బిటెక్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది సురభి.ఢిల్లీలో పుట్టి పెరిగిన ఈ భామ తమిళ ప్రేక్షకులకి బాగా తెలుసు.త్వరలోనే ఎక్స్ప్రెస్ రాజ చిత్రంతో మనల్ని పలకరించబోతున్న ఈ అమ్మడుకి రామ్ చరణ్ అంటే ఇష్టం అంట.
” తెలుగు హీరోల్లో నాకు రామ్ చరణ్ గారంటే ఇష్టం.ఈ మధ్యే ఆయన్ని కలిసాను కూడా.ఎక్స్ప్రెస్ రాజ రషెష్ చూసారు ఆయన.పాటలు చాలా బాగున్నాయని, అందరు మంచి వర్క్ చేసారు అని మెచ్చుకున్నారు.అలాగే నేను చాలా అందంగా కనిపించానని పొగిడారు.
అలా అన్నప్పుడు నాకు చాలా ఆనందంగా అనిపించింది” అంటూ చెప్పుకొచ్చింది ఈ సుందరి.
శర్వానంద్ ఎక్స్ప్రెస్ రాజ ఈ నెల 14న విడుదలకు సిద్ధమవుతోంది.
మేర్లపాక గాంధి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని యూవి క్రియేషన్స్ సంస్థ నిర్మించింది.