టాలీవుడ్ మెగా నటుడు రామ్ చరణ్ వరుస ఆఫర్ లతో దూసుకుపోతున్నాడు.ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు అంతే కాకుండా మరో స్టార్ హీరో ఎన్టీఆర్ కూడా నటిస్తున్నాడు.
ఇక ఈ సినిమాలో బాలీవుడ్, ఐరిష్ నుండి వస్తున్న నటీమణులు హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఇదిలా ఉంటే రామ్ చరణ్ కు దక్కిన రికార్డ్ మరే హీరోకి దక్కలేదంటున్న సినీ పరిశ్రమ.
కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలో రామ్ చరణ్ ఓ గంట పాటు పాత్రలో ఉండేటట్టు నిర్ణయించుకున్నారట సినీ దర్శకులు.దీంతో రామ్ చరణ్ ఆచార్య సినిమాలో నటిస్తున్నాడు.
ఈ సినిమాలో రామ్ చరణ్ సిద్ధ అనే స్టూడెంట్ లీడర్ పాత్రను నటిస్తున్నాడు.ఇక ఈ సినిమాలో రామ్చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ సమయంలో బిజీగా ఉండగా మే 13న విడుదల కానుంది.
ఇదిలా ఉంటే రామ్ చరణ్ నటిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా కూడా అక్టోబర్ 13న విడుదల కావడానికి సిద్ధంగా ఉందని సినీ బృందం తెలిపింది.ఇక రామ్ చరణ్ ఫ్యాన్ ఇండియా సినిమా లో చేయనున్నాడట.అంతేకాకుండా ఈ సినిమాకు దర్శకుడు శంకర్ దర్శకత్వం వహించనున్నాడు.
ఈ సినిమాను కొత్త కాన్సెప్ట్ తో తీయాలని అనుకుంటున్నాడట దర్శకుడు శంకర్.ఇక సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది.
ఇక యాక్షన్ కింగ్ అర్జున్ విలన్ గా నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.మొత్తానికి అటు రాజమౌళి దర్శకత్వంతో పాటు శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న రామ్ చరణ్ దక్షిణాది సినీ ఇండస్ట్రీలో రికార్డు సాధించాడని చెప్పాలి.
ఎందుకంటే ఈ అవకాశం మొదటిసారి రామ్ చరణ్ కే దక్కింది.ఇదివరకు వీరి దర్శకత్వంలో ఏ ఒక్కరి దర్శకత్వంలో నైనా నటించిన హీరోలు మరో దర్శకుని వద్దకు వెళ్లలేదట.
కానీ ఈ అవకాశం రామ్ చరణ్ కు దక్కిందని సినీ పరిశ్రమ చెప్పుకుంటున్నాయి.