టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ ప్రస్తుతం ఆచార్య, ఆర్ఆర్ఆర్ సినిమాల్లో నటిస్తున్నారు.రాజమౌళి, కొరటాల శివ ఇప్పటివరకు దర్శకత్వం వహించిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్లే కావడంతో చరణ్ ఈ రెండు సినిమాలతో మరో రెండు బ్లాక్ బస్టర్ హిట్లు ఖాతాలో వేసుకుంటాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
అయితే రెండు సినిమాలకు చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా తరువాత సినిమా గురించి అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.
ఆర్ఆర్ఆర్ సినిమాతో చరణ్ కు పాన్ ఇండియా హీరోగా కచ్చితంగా గుర్తింపు వస్తుంది.
ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత చరణ్ మాస్టర్ సినిమా డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో నటించే అవకాశాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి.అయితే మాస్టర్ సినిమా ఫలితం చూసిన తరువాత లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో చరణ్ నటించపోతేనే బాగుంటుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
మాస్టర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా లోకేశ్ కనగరాజ్ ఒక ఇంటర్వ్యూలో చరణ్ కు ఒక లైన్ చెప్పానని.త్వరలో చరణ్ ను కలిసి పూర్తి కథ చెబుతానని అన్నారు.మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వచ్చాయి.అయితే మాస్టర్ సినిమా ఫలితం ఆశించిన స్థాయిలో లేకపోవడం ఆ మూవీ రొటీన్ మాస్ మసాలా సినిమా కావడంతో చరణ్ ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు.
మరోవైపు చరణ్ తరువాత సినిమాకు గౌతమ్ తిన్ననూరి, వంశీ పైడిపల్లి పేర్లు కూడా వినిపిస్తున్నాయి.ఈ దర్శకులలో ఎవరి డైరెక్షన్ లో చరణ్ తరువాత సినిమా ఉంటుందో తెలియాల్సి ఉంటుంది.
మరోవైపు తమిళ దర్శకులు డైరెక్షన్ చేసిన కొన్ని తెలుగు సినిమాలు దారుణ ఫలితాలను అందుకోవడంతో ఫ్యాన్స్ కోలీవుడ్ డైరెక్టర్లకు దూరంగా ఉండాలని సూచనలు చేస్తున్నారు.త్వరలో రామ్ చరణ్ తరువాత సినిమాకు డైరెక్టర్ ఎవరో తెలిసే అవకాశం ఉంది.