టాలీవుడ్ ప్రేక్షకులు మరియు హీరోలు సెంటిమెంట్ లను ఎక్కువగా నమ్ముతూ ఉంటారు.ఒక సారి ప్లాప్ పడితే మళ్లీ వారితో సినిమా ను చేసేందుకు ఇష్టపడరు.
అంతగా సెంటిమెంట్ ను ఫాలో అయ్యే వారు ఇప్పుడు ఒక విషయంకు ఆందోళన చెందుతున్నారు.మెగా హీరో రామ్ చరణ్ అభిమానులు గత కొన్ని రోజులుగా దర్శకుడు శంకర్ తీసుకున్న నిర్ణయం విషయంలో ఆందోళనతో ఉన్నారట.
ఇంతకు ఆందోళన ఏంటీ అంటారా.విషయం ఏంటీ అంటే శంకర్ మరియు చరణ్ ల కాంబినేషన్ లో దిల్ రాజు నిర్మించబోతున్న సినిమా లో హీరోయిన్ గా కియారా అద్వానీని ఎంపిక చేయడం జరిగిందట.
ఇప్పటి వరకు అధికారికంగా ఈ విషయమై ప్రకటన రాలేదు.కాని అభిమానులు మాత్రం చాలా ఆందోళనతో ఉన్నట్లుగా తెలుస్తోంది.
వినయ విధేయ రామ సినిమా చరణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ ప్లాప్.ఆరంజ్ సినిమా నిరాశ పర్చినా కూడా అంతకు మించి అన్నట్లుగా వినయ విధేయ రామ సినిమా నిరాశ పర్చింది.
విమర్శలు చి చూసిన ఆ సినిమా తో చరణ్ మళ్లీ కోలుకునేందుకు సమయం పడుతుందని అంతా భావిస్తున్నారు.రామ్ చరణ్ ఆ సినిమా జ్ఞాపకాల నుండి బయట పడాలని అభిమానులు కోరుకుంటున్నారు.
అలాంటిది మళ్లీ ఆ సినిమా లో నటించిన హీరోయిన్ ను శంకర్ తీసుకు రావడం పట్ల అభిమానులు కాస్త వ్యతిరేకంగా ఉన్నారు.ఇలాంటి సమయంలో ఆమెను తీసుకు రావడం అవసరమా అంటున్నారు.
బాలీవుడ్ లో ఇంకా చాలా మంది స్టార్ హీరోయిన్స్ ఉన్నారు.కాని నీకు ఆమె తప్ప మరెవ్వరు కనిపించడం లేదా అంటూ శంకర్ ను మెగా అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
శంకర్ నిర్ణయంలో మార్పు ఉంటుందా లేదా అనేది కాలమే నిర్ణయించాలి.