తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు దిల్ రాజు. ఈయన ఒకవైపు నిర్మాతగా భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించడమే కాకుండా డిస్ట్రిబ్యూటర్ గా కూడా వ్యవహరిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఈయన పీస్1 సినిమాని తెలుగులో విడుదల చేస్తున్నట్లు తెలిసింది.ఇకపోతే దిల్ రాజుకు మెగా కుటుంబానికి మధ్య థియేటర్ విషయంలో పొరపర్చాలు ఏర్పడ్డాయని దీంతో దిల్ రాజు వ్యవహారంపై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎంతో అసహనం వ్యక్తం చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమా సొంతంగా రిలీజ్ చేసుకుంటున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.ఇక ఈ సినిమా అక్టోబర్ 5వ తేదీ దసరా పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ క్రమంలోనే హైదరాబాద్లో ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉన్నటువంటి సుదర్శన్ థియేటర్ విషయంలో దిల్ రాజు పై రామ్ చరణ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.ఈ థియేటర్లో గాడ్ ఫాదర్ సినిమా విడుదల చేయాలని భావించినప్పటికీ ఇందులో పీస్1 సినిమాను విడుదల చేయటానికి సిద్ధమయ్యారు.
ఈ క్రమంలోనే సుదర్శన్ థియేటర్ గాడ్ ఫాదర్ సినిమాకే కావాలని భావించారు.అయితే ఈ విషయం తెలుసుకున్న రాంచరణ్ స్వయంగా రంగంలోకి దిగి ఈ థియేటర్ సమస్యను పరిష్కరించారు.ఈ క్రమంలోనే ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉన్నటువంటి సుదర్శన్ థియేటర్లో గాడ్ ఫాదర్ సినిమా కోసం కేటాయించి, పీస్ 1 ని దేవీ థియేటర్ కు మార్చారని తెలుస్తోంది.ఇక గాడ్ ఫాదర్ డిజిటల్ రైట్స్ ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఫ్యాన్సీ ధరకు కైవసం చేసుకున్నట్టు తెలుస్తుంది.