రామ్ చరణ్ హీరోగా ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు.దీంతో పాటు ఆచార్య సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.
ఈ రెండు సినిమాల తర్వాత దర్శక దిగ్గజం శంకర్ తో ఓ పాన్ ఇండియా మూవీ చేయనున్నాడు.దిల్ రాజు ఏకంగా రెండు వందల కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.
ఇక ఇప్పటికే ఈ సినిమా ప్రీప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయ్యింది.ఇదిలా ఉంటే ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే రామ్ చరణ్ నిర్మాతగా కూడా భారీ బడ్జెట్ సినిమాలు నిర్మిస్తున్నాడు.
తన తండ్రి కోసం నిర్మాతగా మారిన రామ్ చరణ్ ఇప్పుడు ఆచార్య సినిమాలో కూడా ఒక భాగస్వామిగా ఉన్నాడు.అలాగే లూసీఫర్, వేదాళం రీమేక్ లకి కూడా నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు.
ఈ రెండు సినిమాల తర్వాత బయట హీరోలతో ఒక భారీ మల్టీ స్టారర్ సినిమాని రామ్ చరణ్ ప్లాన్ చేస్తున్నాడు.ఇప్పటికే మలయాళీ సూపర్ హిట్ మూవీ డ్రైవింగ్ లైసెన్స్ రీమేక్ రైట్స్ ని రామ్ చరణ్ కొనడం జరిగింది.
అయితే ఈ సినిమాని ముందుగా బాబాయ్ కలయికలో తానే చేయాలని అనుకున్నాడు.
అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు చేస్తున్నాడు.వీటిని పూర్తి చేసి మళ్ళీ రాజకీయాలలో బిజీ కానున్నాడు.ఇప్పుడున్న కమిట్మెంట్ పూర్తి కావడానికి రెండేళ్ళు పడుతుంది.
ఈ లోపు ఎన్నికలు వచ్చేస్తాయి.ఎన్నికలలో బిజీ అయితే సినిమాలు పూర్తిగా పవన్ పక్కన పెడతాడు.
దీనిని దృష్టిలో ఉంచుకొని డ్రైవింగ్ లైసెన్స్ రీమేక్ ని బయట హీరోలతో చేయడానికి ఫిక్స్ అయ్యాడు.ఇక ఈ సినిమా కోసం మాస్ మహారాజ్ రవితేజ, తమిళ్ స్టార్ విజయ్ సేతుపతిని ఇప్పటికే సంప్రదించడం జరిగిందని తెలుస్తుంది.
వీరిద్దరి కలయికలో రీమేక్ చేసి తెలుగు, తమిళ్ లో ఏక కాలంలో రిలీజ్ చేయాలని భావిస్తున్నట్లు బోగట్ట.దీనికి ఇప్పటికే రంగం సిద్ధమైందని, త్వరలో అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది.