మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయ్యాడు.ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ మరో అగ్ర డైరెక్టర్ దర్శకత్వంలో నెక్స్ట్ సినిమా చేస్తున్నాడు.
మావెరిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శంకర్ తో చరణ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్రకటించాడు.రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా ‘RC15’.
ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.శంకర్ సినిమాలు ఏ రేంజ్ లో ఉంటాయో రిలీజ్ తర్వాత ఎన్ని రికార్డులను క్రియేట్ చేస్తాయో అందరికి తెలుసు.
అందుకే ఈ సినిమా ఎలాంటి అప్డేట్ లేకపోయినా దీనిపై మంచి అంచనాలను పెంచుకున్నారు.పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రెజెంట్ శరవేగంగా షూట్ జరుపు కుంటుంది.
ఇక చరణ్ ఈ సినిమా తర్వాత కూడా ఇంట్రెస్టింగ్ లైనప్ ను సెట్ చేసుకుంటున్నాడు.ఇప్పటికే రామ్ చరణ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఒక సినిమాను అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.అయితే ఈ సినిమా శంకర్ సినిమా అయిపోయిన వెంటనే స్టార్ట్ అవుతుందో లేదో తెలియదు.ఇక ఈ సినిమా ఇలా ఉండగానే మరింత మందిని లైన్లో పెడుతున్నట్టు రోజుకొక వార్త వైరల్ అవుతుంది.
అందులో కన్నడ డైరెక్టర్ పేరు కూడా ఉంది.మఫ్టీ సినిమాతో కన్నడ ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్న నర్తన్ తో రామ్ చరణ్ సినిమా చేయనున్నారు అని గత కొంత కాలంగా టాక్ వస్తుంది.అయితే తాజాగా నర్తన్ చరణ్ దర్శకత్వంలో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్.ఇప్పటికే నర్తన్ చరణ్ కు కథ చెప్పగా ఆయనకు బాగా నచ్చింది అని.ఇది ఒక నావి యాక్షన్ అడ్వెంచర్ అని తెలుస్తుంది.చూడాలి దీనిపై క్లారిటీ ఎప్పుడు వస్తుందో.