రామ్ చరణ్కు టాలీవుడ్లో ఉన్న స్టార్ డమ్ గురించి అందరికీ తెలిసిందే.ఆయన ప్రస్తుతం చేస్తున్న సినిమాలు అన్నీ పెద్ద ప్రాజెక్టులే.
పైగా అగ్ర దర్శకులతో చేస్తున్నాడు.ఇందులో ఆచార్య, ఆర్ ఆర్ ఆర్ తో పాటుగా శంకర్ కాంబోలో వస్తున్న మూవీ కూడా ఉంది.
కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఆచార్య దాదాపు షూటింగ్ కంప్లీట్ చేసుకుని రిలీజ్కు రెడీగా ఉంది.ఇందులో చిరుతో పాటు నటిస్తున్నాడు రామ్ చరణ్.
ఇక ఆర్ ఆర్ ఆర్లో రాజమౌళి డైరెక్షన్లో చేస్తున్నాడు.ఈ మూవీపై ప్రపంచ వ్యాప్తంగా అంచనాలు ఉన్నాయి.
ఇంకోమూవీ శంకర్ది.
ఇక శంకర్ సినిమాలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఇందులో రామ్చరణ్ ఎలా ఉంటారో అని ఇప్పటికే అంచనాలు పెరిగిపోతున్నాయి.ఈ మూడు సినిమాల్లో ఆచార్య, ఆర్ ఆర్ ఆర్లో చరణ్ చిరు, ఎన్టీఆర్తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు.
అయితే శంకర్ సినిమాలో మాత్రం ఒక్కడే హీరోగా చేస్తున్నాడు.ఇక ఇదలా ఉంటే ఈ మూడు సినిమాల్లో ఓ రేర్ కాంబోలు వస్తున్నాయి.
ఆ ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లతో చరణ్ చాలా సంవత్సరాల తర్వాత చేస్తున్నాడు.అందులో మణిశర్మ, థమన్, కీరవాణిలు ఉన్నారు.
చరణ్ మొదటి సినిమా చిరుతకు స్వరాలు అందించిన మణివర్మ ఆ తర్వాత రచ్చ మూవీ కోసం పనిచేశారు.దీని తర్వాత మళ్లీ ఇప్పుడు ఆచార్య మూవీ కోసం కలిశారు.ఇక కీరవాణితో మగధీర తర్వాత మళ్లీ ఆర్ ఆర్ ఆర్ సినిమా కోసం టీమ్ అప్ అవుతున్నారు.తమన్తో బ్రూస్లీ సినిమా తర్వాత మళ్లీ ఇప్పుడు శంకర్ మూవీ కోసం కలుస్తున్నారు రామ్ చరణ్.
ఇలా ముగ్గురు దిగ్గజ సంగీత దర్శకులతో చాలా రోజుల తర్వాత కలుస్తున్నాడు రామ్ చరణ్.ఇక ఆయన నటిస్తున్న సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.వీటితో రామ్ చరణ్ ఏ మేరకు సత్తా చాటుతారో చూడాలి.