మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రెజెంట్ వరుస ప్రాజెక్ట్స్ చేస్తూ బిజీగా ఉన్నాడు.ఒక వైపు ఆర్ ఆర్ ఆర్, ఆచార్య సినిమాల షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంచాడు.ఇక మరొక వైపు అగ్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో సినిమా ప్రకటించడమే కాకుండా షూటింగ్ కూడా స్టార్ట్ చేసి అంతే వేగంగా పూర్తి చేస్తున్నాడు.RC15‘ అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూణే లో స్టార్ట్ చేసి కీలకమైన సన్నివేశాలతో పాటు భారీ సెట్ లో ఒక పాటను కూడా తెరకెక్కించారు.ఇక రెండవ షెడ్యూల్ కు కొద్దిగా గ్యాప్ హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో వేసిన సెట్ లో స్టార్ట్ చేసారు.
ఈ షెడ్యూల్ లో మరొక సాంగ్ తో పాటు ఇతర కీలక సన్నివేశాలను కూడా తెరకెక్కిస్తున్నారు.శంకర్ తన కెరీర్ లో ఎప్పుడు లేనంత స్పీడ్ గా ఈ సినిమాను పూర్తి చేస్తున్నాడు.
ఇక ఈ సినిమాను దిల్ రాజు 170 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడని సమాచారం.దిల్ రాజు కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.అంతేకాదు ఈ సినిమా దిల్ రాజుకు 50వ సినిమా కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాడు.ఇక తాజాగా ఈ సినిమా గురించి రామ్ చరణ్ ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను తెలిపాడు.
శంకర్ దర్శకత్వంలో నటించాలనే నా కల నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉంది అని చరణ్ తెలిపాడు.
ఇక ఈ సినిమాను 2023 ఫిబ్రవరిలో విడుదల చేయాలనీ నిర్ణయించుకున్నట్టుగా తెలిపాడు.ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడే ఎలాంటి విషయాలు చెప్పలేం కానీ ఖచ్చితంగా ఒక మంచి సినిమా అని ధీమా వ్యక్తం చేసాడు.వచ్చే ఏడాదిలో షూటింగ్ ముగించనున్నట్టు తెలిపాడు.
ఈ సినిమా 2023 సంక్రాంతికి విడుదల అవుతుందని భావించిన ఇప్పుడు చరణ్ ఫిబ్రవరిలో అని క్లారిటీ ఇచ్చాడు.పెద్ద సీజన్ అయినా సంక్రాంతి వదిలేసి ఫిబ్రవరిలో ఎందుకు విడుదల చేయాలనీ
అనుకుంటున్నారని అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.