మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తు్న్నారు.అయితే ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో మహేష్ నటించనున్న పాత్ర ఎలా ఉంటుందా అని అందరూ అనుకున్నారు.కానీ ఇంతలోనే మహేష్ ఈ సినిమా నుండి తప్పుకున్నాడు.మహేష్ ఈ సినిమా నుండి తప్పుకోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయంటూ వార్తలు వచ్చాయి.అయితే ఈ సినిమాలో మహేష్ చేయబోయిన పాత్రలో ఎవరు నటిస్తారా అనే అంశంపై చిత్ర యూనిట్ అప్పుడే క్లారిటీ ఇచ్చేసింది.
ఈ సినిమాలో కేమియో పాత్రలో నటించేందుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒప్పుకున్నాడని ఆచార్య టీమ్ తెలిపింది.
కాగా ఈ సినిమాలో నటించేందుకు గాను చరణ్ ఏకంగా రూ.15 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోనున్నాడట.భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాను నిరంజన్ రెడ్డితో కలిసి రామ్ చరణ్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాడు.
ఇక ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరు నటిస్తున్నారనే విషయం తెలియాల్సి ఉంది.