రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ అనే పాన్ ఇండియా చిత్రం రూపొందుతున్న సంగతి అందరికి తెలిసిందే.ఈ చిత్రంలో రామ్ చరణ్, ఎన్టిఆర్ లు నటిస్తున్నారు.
పీరియాడికల్ నేపథ్యం కలిగిన సోషియో ఫాంటసీ మూవీ గా ఈ చిత్రం రూపొందుతుంది.ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ఆర్ఆర్ఆర్ కు సంబందించిన క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
చర్రీ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుంటే. తారక్ కొమురమ్ భీమ్ పాత్రలో నటిస్తున్నాడు.
అయితే చరణ్ ఆర్ఆర్ఆర్ చిత్రంతో పాటుగా తన తండ్రి చిరంజీవి తో ఆచార్య అనే చిత్రాని నిర్మిస్తున్నాడు.అలాగే ఈ చిత్రంలో కీలక పాత్రలో చరణ్ నటిస్తున్నాడు.
ఆర్ఆర్ఆర్ షూటింగ్ నుండి ఏ మాత్రం విరామం దొరికిన ఆచార్య సెట్స్ లో చరణ్ కనిపిస్తున్నాడు.
ఈ నేపథ్యంలోనే ఇటీవల ఈ చిత్రం యొక్క షూటింగ్ ఆంధ్రప్రదేశ్ లోని రంపచోడవరం అడవుల్లో జరిగింది.
అక్కడ తండ్రి, కొడుకులపై ఓ పాట తో పాటుగా యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించినట్లుగా సమాచారం.అయితే ఈ చిత్రం యొక్క షూటింగ్ రంపచోడవరం అడవుల నుండి తెలంగాణ ఖమ్మం జిల్లాలోని ఇల్లందు సింగరేణి ఘనుల్లో జరుపుకొనున్నది.
ఇప్పటికే ఆచార్య టీమ్ అక్కడకు బయలుదేరి వెళ్లింది.ఇక ఈ టీమ్ తో పాటు రామ్ చరణ్ కూడా ఇల్లందు కు వెళ్ళాడు.రంపచోడవరం నుండి నేరుగా ఆర్ఆర్ఆర్ షూటింగ్ కు వెళ్ళుతాడు అనుకుంటే అందరికి షాక్ ఇస్తూ.ఇల్లందు బయలుదేరి వెళ్ళాడు.
ప్రస్తుతం అక్కడి షూటింగ్ సెట్స్ లోని చిరంజీవి, చరణ్ ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనం ఇస్తున్నాయి.ఇలా ఆర్ఆర్ఆర్ షూటింగ్ ను పోస్ట్ పోన్ చేయడంతో రాజమౌళి కూడా ఒక్కింత అసహనం వ్యక్తం చేస్తున్నాడు.
ఆర్ఆర్ఆర్ నుండి యాక్షన్ పార్టు ను పూర్తి చేసి రొమాంటిక్ పాటల మూడ్ లోకి వెళ్ళే ఆలోచనలో జక్కన ఉన్నాడు.అందుకోసం ఓ స్టూడియో లో సెట్ ను కూడా వేశారు.
త్వరలో రామ్ చరణ్ అలియా భట్ ల మీద ఓ సాంగ్ ను షూట్ చేయనున్నారు.