సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ప్రతి ఒక్కరు కరోనా కోరల్లో చిక్కుకుంటున్నారు.తనకు ఎవరూ అతీతం కాదని కరోనా వైరస్ చూపిస్తుంది.
బేధాలనేవి మనుషులలో ఉంటాయి తప్ప మాలాంటి వైరస్ లకి ఉండవని ప్రతి ఒక్కరికి అర్ధమయ్యే విధంగా అద్భుతమైన నీతిని ఈ ఏడాది కరోనా వైరస్ వచ్చి చెప్పింది.అలాగే తన మేధాశక్తితో ప్రపంచాన్నీ శాశిస్తున్న అనుకుంటున్న మనుషులకి నీకు అంత సీన్ లేదని, దమ్ముంటే నన్ను ఆపి చూడు అంటూ సవాల్ విసిరింది.
కంటికి కనిపించని చిన్న వైరస్ ప్రతి ఒక్కరికి భయాన్ని పరిచయం చేసింది.ఈ కరోనా వైరస్ సైలెంట్ అయ్యింది అని అందరూ అనుకుంటే కాస్తా రూపాంతరం చెంది తన శక్తిని మరింత పెంచుకొని మానవ సమాజంపై దాడి చేయడానికి రెడీ అయ్యి తన పని మళ్ళీ మొదలు పెట్టింది.
ఏది ఏమైనా కరోనా మనిషిని చంపగలదు కానీ మానవ సంబంధాలని కాదని కొన్ని సంఘటనలు రుజువు చేస్తున్నాయి.ఎంతో మంది కరోనా కాలంలో తాము చనిపోతామని తెలిసిన మానవత్వంతో కరోనా రోగులకి సేవలు చేయడానికి ముందుకొచ్చారు.
పోలీసులు విధి నిర్వహణలో కరోనా నుంచి ప్రజలని కాపాడే ప్రయత్నం చేశారు.ఇవన్నీ మానవ సంబంధాలకి మచ్చుతునక.
ఇదిలా ఉంటే మెగా ఫ్యామిలీ హీరో రామ్ చరణ్ కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.అయితే సాధారణంగా కరోనా వస్తే ఆ పేషేంట్ ని సొంత తల్లిదండ్రులు, భార్య బిడ్డలు అందరూ దూరం పెట్టి క్వారంటైన్ లో ఒంటరిగా ఉండమని వదిలేస్తారు.అయితే రామ్ చరణ్ సతీమణి ఉపానస మాత్రం భర్తతో పాటు ఉంటూ అతనికి కొండంత ధైర్యం ఇస్తుంది.కరోనా వచ్చిన కూడా అతని ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని, తనకి కరోనా సోకినా అతనితో ఉండాల్సిన అవసరం ఉందని గుర్తించి రామ్ చరణ్ తో పటు క్వారంటైన్ లో తానుకూడా ఉంటుంది.
ఇలాంటి సంఘటనలు భార్యాభర్తల అనుబంధానికి ప్రతీకగా నిలుస్తాయి.రామ్ చరణ్, ఉపాసన క్వారంటైన్ ఉన్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఈ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతుంది.