మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తమిళ దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించబోతున్న భారీ చిత్రం కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ శర వేగంగా జరుపుకుంటుంది.ఇటీవల దిల్ రాజు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమా ను జులై నుండి చిత్రీకరణ జరుపబోతున్నట్లుగా పేర్కొన్నాడు.
అయితే ఇండియన్ 2 ను శంకర్ మళ్లీ మొదలు పెడితే చరణ్ మూవీ ఆలస్యం అయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.దాంతో చరణ్ మూవీ గురించిన ప్రతి విషయం కూడా అందరికి ఆసక్తిగా మారింది.
చరణ్ మరియు శంకర్ ల కాంబోలో రూపొందుతున్న ఈ సినిమా కు కియారా అద్వానీ ని హీరోయిన్ గా ఎంపిక చేసే విషయమై చర్చలు జరుపుతున్నట్లుగా సమాచారం అందుతోంది.ఇక ఈ సినిమా లో కీలక పాత్రను కన్నడ స్టార్ సుదీప్ తో చేయించాలనే నిర్ణయానికి వచ్చారట.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం కన్నడ స్టార్ హీరో సుదీప్ ను ఈ సినిమా కోసం ఇప్పటికే శంకర్ సంప్రదించాడని ఆయన వెంటనే ఓకే చెప్పాడని తెలుస్తోంది.సౌత్ లో అన్ని భాషల్లో కూడా ఆయనకు మంచి పేరు ఉంది.
కనుక ఆయన ఈ సినిమా కోసం శంకర్ తీసుకున్నాడు.గతంలో సుదీప్ తెలుగు లో నటించి మెప్పించాడు.
కనుక ఈ సినిమా లో కూడా ఆయన తెలుగు వారిని మెప్పిస్తాడనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.రికార్డు బ్రేకింగ్ బడ్జెట్ తో శంకర్ దర్శకత్వం లో దిల్ రాజు నిర్మించబోతున్న ఈ సినిమా అంచనాలకు తగ్గట్లుగా భారీగా ఉంటుందనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు.
మరో వైపు ఈ సినిమా కు సంబంధించిన కీలక పాత్రల నటీ నటుల ఎంపిక విషయంలో ఆసక్తికర చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ సినిమా లో మరింత మంది ప్రముఖ నటీనటులు నటించబోతున్నారో అనే చర్చ కూడా మొదలైంది.