తమిళ స్టార్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో చరణ్ సినిమా కన్ఫర్మ్ అయ్యింది.భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా ను దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న విషయం తెల్సిందే.
ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుండి కూడా రెండు విషయాల పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.ఆ చర్చ కు తెర పడేది ఎప్పుడో అర్థం అవ్వడం లేదు.
ఆ రెండు విషయాలు మెగా ఫ్యాన్స్ తో పాటు అందరిని కూడా పీడిస్తున్నాయి.మొదటిది ఈ సినిమాలో చరణ్ కాకుండా మరో హీరో కూడా ఉంటాడా.
అది పవన్ కళ్యాణ్ అంటూ కొందరు కాదు తమిళ హీరో అంటూ మరి కొందరు ప్రచారం చేస్తున్నారు.అందులో ఉన్న నిజం ఎంత.ఒక వేళ చరణ్ మల్టీ స్టారర్ సినిమా చేస్తుంటే ఆయనకు శంకర్ ఇస్తున్న ప్రాముఖ్యత ఎంత అనేది కూడా చర్చనీయాంశంగా మారింది.ఇక మరో విషయమై చరణ్ అభిమానులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.
ఈ సినిమా లో చరణ్ కు జోడీగా రష్మిక మందన్న నటిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.ఆ విషయమై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు.వచ్చే సమ్మర్ తర్వాత సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుందని అంటున్నారు.అప్పటి వరకు హీరోయిన్ విషయమై క్లారిటీ రాకపోవచ్చు.
ఈ సినిమా మల్టీ స్టారర్ సినిమానేనా మరియు రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుందా అనే విషయమై ప్రస్తుతం చర్చలు జోరుగా సాగుతున్నాయి.ఈ విషయాలపై దిల్ రాజు క్లారిటీ ఇవ్వాలంటే పదే పదే మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియా ద్వారా కామెంట్ చేస్తున్నారు.
ప్రస్తుతం చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు.ఆ సినిమా షూటింగ్ పూర్తి అయిన వెంటనే ఈ సినిమా లో జాయిన్ అవ్వబోతున్నాడు.
మరో వైపు చరణ్ ఆచార్యలో కూడా గెస్ట్ రోల్ ను చేస్తున్న విషయం తెల్సిందే.