మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సౌత్ దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమా ఇటీవలే షూటింగ్ ప్రారంభోత్సవం జరిగింది.సినిమా ప్రారంభోత్సవం కోసం ఏకంగా కోటి రూపాయలను ఖర్చు చేశాడు అంటూ వార్తలు వస్తున్నాయి.
ఈ సినిమా దిల్ రాజుకు 50వ సినిమా అవ్వడంతో పాటు రామ్ చరణ్ కు 15వ సినిమా అవ్వడం వల్ల అంచనాలు భారీగా ఉన్నాయి.పైగా ఈ సినిమా తో మొదటి సారి దర్శకుడు శంకర్ తెలుగు లో సినిమా ను చేస్తున్నాడు.
ముందస్తుగా అనుకున్న ప్రకారం ఈ సినిమా ను అక్టోబర్ లో హైదరాబాద్ లో వేసిన ఒక భారీ సెట్టింగ్ లో మొదలు పెట్టాల్సి ఉంది.మొదటి షెడ్యూల్ లో పాట చిత్రీకరించబోతున్నారు.
పాట కూడా ఇప్పటికే రెడీ అయ్యింది.ఇటీవల శంకర్ ఆ విషయమై మాట్లాడుతూ థమన్ రెడీ చేసిన ట్యూన్ చాలా బాగా వచ్చిందని పేర్కొన్నాడు.
దాంతో పాటు షూటింగ్ కు కూడా రెడీ అవుతున్నట్లుగా ప్రకటించడంతో అంతా కూడా ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యారు.
షూటింగ్ ప్రారంభం కోసం జరుగుతున్న ఏర్పాట్లకు వర్షం అడ్డు వచ్చింది.ఆ మద్య కురిసిన వర్షం కారనంగా దాదాపుగా వారం రోజులు పని ఆగిపోయింది.ఆ తర్వాత మరో వారం రోజుల పాటు అక్కడ ఉన్న నీరు తొలగించేందుకు సమయం పట్టిందట.
దాంతో సెట్టింగ్ నిర్మాణం విషయంలో ఆలస్యం అవుతోంది.ఆ కారణంగానే సినిమాను అనుకున్న తేదీ కంటే వారం నుండి పది రోజుల ఆలస్యంగా సినిమాను పట్టాలెక్కిస్తారు అంటూ వార్తలు వస్తున్నాయి.
ఈ విషయంలో చిత్ర యూనిట్ సభ్యులు మరియు ఫిల్మ్ మేకర్స్ చాలా అసంతృప్తితో ఉన్నారట.శంకర్ సినిమా అంటే అనుకున్న సమయం కంటే కనీసం ఆరు నెలలు అయినా ఆలస్యం అవుతుంది.
కాని ఇప్పుడు ప్రారంభం కు ముందే ఆలస్యం అవ్వడం అభిమానులకు నిరాశ కలిగిస్తుంది.ఎంత ఆలస్యం అయినా మరేం అయినా కూడా ఖచ్చితంగా సినిమా మరో రేంజ్ లో ఉంటుంది అనే నమ్మకంను మెగా ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు.
శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాదికి ముగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.ఇలా ఆలస్యం అయితే విడుదల కోసం 2023 వరకు వెయిట్ చేయాల్సి రావచ్చు అంటున్నారు.