మెగా హీరో రామ్ చరణ్ మరియు సౌత్ తో పాటు నార్త్ లో కూడా స్టార్ దర్శకుడిగా పేరు దక్కించుకున్న శంకర్ ల కాంబినేషన్ లో టాలీవుడ్ స్టార్ నిర్మాత దిల్ రాజు ఒక సినిమా ను నిర్మించబోతున్నాడు.అది ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది.
ఈ ఏడాది ద్వితీయార్థంలో సినిమా ను పట్టాలెక్కించే అవకాశం ఉంది.శంకర్ సినిమా అనగానే దేశ వ్యాప్తంగా ఓ రేంజ్ అంచనాలు ఉంటాయి.
రోబో మరియు 2.ఓ సినిమా లతో ఆయన ఏ రేంజ్ లో వసూళ్లను దక్కించుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.శంకర్ ప్రతి సినిమా కు బాలీవుడ్ రేంజ్ మ్యూజిక్ డైరెక్టర్ తోనే వర్క్ చేశాడు.ముఖ్యంగా ఆయన ఏ ఆర్ రహమాన్ తో వర్క్ చేయాలని భావిస్తాడు.
కనుక చరణ్ మూవీకి కూడా మొదటి సారి రహమాన్ సంగీతాన్ని ఇవ్వబోతున్నట్లుగా ప్రచారం జరిగింది.మెగా అభిమానులు ఫుల్ హ్యాపీగా చరణ్ రహమాన్ కాంబో కోసం వెయిట్ చేస్తున్నారు.
భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా కు రహమాన్ ను కాకుండా ఎస్ ఎస్ థమన్ ను సంగీత దర్శకుడిగా ఎంపిక చేశారు అనే వార్తలు వస్తున్నాయి.శంకర్ మొదటి సారి తన సినిమాకు థమన్ ను ఎంపిక చేశాడనే వార్తలు వస్తున్నాయి.
బడ్జెట్ ఇష్యూతో పాటు రహమాన్ సినిమా కు ఎంపిక చేస్తే చాలా ఆలస్యం అవుతుంది.ఆయన ఉండే బిజీ కారణంగా ట్యూన్స్ ఇవ్వాలంటే కనీసం ఏడాది పడుతుంది.
అందుకే ఆయన కంటే థమన్ ను ఈ సినిమా కు ఎంపిక చేయడం బెటర్ అనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు అనేది కొందరు చెబుతున్న విషయం.అసలు విషయం ఏంటీ అనే విషయమై క్లారిటీ రావాలి అంటే కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.
తాజా వార్తలు