తమిళంలో హిట్ అయిన విక్రమ్ వేద చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలని భావిస్తున్నారు అంటూ గత రెండు సంవత్సరాలుగా మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి.మాధవన్ మరియు విజయ్ సేతుపతి కలిసి నటించిన విక్రమ్ వేద చిత్రాన్ని తెలుగులో మెగా హీరోలకు సన్నిహితుడు అయిన ఒక నిర్మాత రీమేక్ రైట్స్ దక్కించుకున్నాడు.
కనుక అది ఖచ్చితంగా మెగా హీరోతోనే నిర్మాణం చేస్తారని ఎప్పటి నుండో వార్తలు వస్తున్నాయి.
అనుకున్నట్లుగానే విక్రమ్ వేద చిత్రం ఇప్పుడు చరణ్ వద్దకు వెళ్లినట్లుగా సమాచారం అందుతోంది.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం రామ్ చరణ్ ప్రస్తుతం చేస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రం షూటింగ్ పూర్తి అయిన వెంటనే చిరు 152 చిత్రం కోసం నెల రోజులు చిత్రీకరణలో పాల్గొనబోతున్నాడు.ఆ వెంటనే విక్రమ్ వేద చిత్రం షూటింగ్ను మొదలు పెట్టబోతున్నట్లుగా చెబుతున్నారు.
దర్శకుడు.ఇతర టెక్నికల్ టీంను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.ఇక ఇదే చిత్రంలో రవితేజ కూడా ఉంటాడని అంటున్నారు.మాధవన్ పోషించిన పాత్రను రవితేజ పోషించబోతున్నాడు.అలాగే విజయ్ సేతుపతి పాత్ర కోసం రవితేజతో సంప్రదింపులు జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది.ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రవితేజ ఖచ్చితంగా ఈ రీమేక్కు ఒప్పుకుంటాడు.
ఈ కాంబో సినిమాపై జనాల్లో ఆసక్తి ఉంది.తప్పకుండా సక్సెస్ అవుతుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది.
మరి సినిమా ప్రకటన ఎప్పుడు ఉంటుందో చూడాలి.