టాలీవుడ్ జక్కన్న రాజమౌళి సెకండ్ వేవ్ తర్వాత ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ ను పునః ప్రారంభించాడు.రామ్ చరణ్ తో పాటు కీలక నటీ నటులు పాల్గొంటున్నారు.
ఒకటి రెండు రోజుల్లో ఎన్టీఆర్ మరియు వచ్చే నెల మొదటి వారంలో ఆలియా భట్ ఇంకా అజయ్ దేవగన్ లు జాయిన్ అవ్వబోతున్నారు.ఈ సమయంలోనే ఈ సినిమా కోసం మరో భారీ సెట్టింగ్ ను వేయిస్తున్నట్లుగా తెలుస్తోంది.
గత ఏడాది ఆరంభంలోనే సినిమా చిత్రీకరణ ముగింపు దశకు వచ్చిందనే వార్తలు వచ్చాయి.అన్ని అనుకున్నట్లుగా జరిగి ఉంటే సినిమా మే నెలలో షూటింగ్ పూర్తి అయ్యేది.
కాని కరోనా కారణంగా ఆలస్యం అవుతుంది.ప్రముఖ స్టార్స్ ఈ సినిమా చిత్రీకరణకు మళ్లీ డేట్లు ఇవ్వడం వల్ల షూటింగ్ ను పునః ప్రారంభించేందుకు త్వరగానే ముహూర్తం కుదిరింది.
మరి ఈ సినిమా షూటింగ్ ముగింపు ఎప్పుడు అనే విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు.
రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా పాన్ ఇండియా మూవీ అనడం కంటే ఇంటర్నేషనల్ మూవీ అన్నట్లుగా చెబుతున్నారు.
ఈ సినిమా ను ఇండియన్ భాషల్లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా విడుదల చేస్తారట.రికార్డు బ్రేకింగ్ వసూళ్లు ఈ సినిమాకు నమోదు అవ్వడం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.
ప్రస్తుతం సినిమా కోసం యూనిట్ సభ్యులు నైట్ షూట్ ను చేస్తున్నారని.ఇక ఈ చివరి షెడ్యూల్ లో రెండు పాటలు మరియు యాక్షన్ సన్నివేశాలను కూడా చిత్రీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి.రామ్ చరణ్ కు జోడీగా నటిస్తున్న ఆలియా భట్ పాత్ర అద్బుతంగా ఉంటుందని.ఇద్దరు హీరోల మద్య ఉండే ఒక ఫైట్ సన్నివేశం మళ్లీ ఎప్పుడు చూడలేం అన్నట్లుంగా ఉంటుందని విజయేంద్ర ప్రసాద్ అనడంలో అంచనాలు భారీగా ఉన్నాయి.
ఇంతటి భారీగా అంచనాలున్న సినిమా ను ఆగస్టులో షూటింగ్ ముగించేలా ప్లాన్ చేస్తున్నారు.