మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రసెంట్ వరుస ప్రాజెక్ట్స్ చేస్తూ బిజీగా ఉన్నాడు.ఒక వైపు ఆర్ ఆర్ ఆర్, ఆచార్య సినిమాల షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంచడమే కాకుండా మరోవైపు తర్వాత ప్రాజెక్ట్స్ ను కూడా సెట్స్ మీదకు తీసుకు వెళ్లేందుకు అన్ని సన్నాహాలు చేస్తున్నాడు.ఇప్పటికే అగ్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో సినిమా ప్రకటించడమే కాకుండా షూటింగ్ కూడా స్టార్ట్ చేసి అంతే వేగంగా పూర్తి చేస్తున్నాడు.
‘RC15’ అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూణే లో స్టార్ట్ చేసి పూర్తి చేసేసారు.ఫస్ట్ షెడ్యూల్ లో కీలక మైన సన్నివేశాలతో పాటు భారీ సెట్ లో ఒక పాటను కూడా తెరకెక్కించారు.
ఇక రెండవ షెడ్యూల్ కు కొద్దిగా గ్యాప్ ఇచ్చి స్టార్ట్ చేసారు.
ఈ రెండవ షెడ్యూల్ ను హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో స్టార్ట్ చేసి మరొక సాంగ్ తో పాటు ఇతర కీలక సన్నివేశాలను కూడా తెరకెక్కించారు.
ఈ సినిమాను దిల్ రాజు 170 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ చరణ్ కు జోడీగా రెండవసారి నటిస్తుంది.అయితే ఈ సినిమా కరోనా థర్డ్ వేవ్ కొనసాగుతున్న కూడా షూటింగ్ ఆపేయడానికి రెడీగా లేరు.
చిన్న బ్రేక్ తర్వాత తిరిగి కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేయబోతున్నారని తెలుస్తుంది.ఎట్టిపరిస్థితుల్లోనూ తర్వాత షెడ్యూల్ ఫిబ్రవరి రెండవ వారంలో స్టార్ట్ చేయనున్నారని సమాచారం.కోవిడ్ పరిస్థితులు ఎంత ఇబ్బందికరంగా ఉన్న ఈ సినిమా ఆపేందుకు ఇటు చరణ్ కానీ అటు శంకర్ కానీ రెడీగా లేరు.
ఏం జరిగిన తగ్గేదేలే అంటున్నారు.మరి చూడాలి ఈ నెలలో అన్ని చక్కబెడితే వీరు అనుకున్నట్టు ఈ సినిమా నెక్స్ట్ షేడ్యూల్ స్టార్ట్ అవుతుంది.