కీర్తి సురేష్ కు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది.ఆమెకు తెలుగు, తమిళ్ భాషల్లో మంచి మార్కెట్ ఉంది.
మహానటి సినిమా తర్వాత ఈమె స్టార్ హీరోయిన్ గా మారిపోవడమే కాకుండా ఈమె క్రేజ్ కూడా అమాంతంగా పెరిగింది.ఒకే ఒక్క సినిమాతో నేషనల్ అవార్డు సైతం అందుకుని తన టాలెంట్ నిరూపించుకుంది.
కీర్తి సురేష్ ప్రస్తుతం ‘గుడ్ లక్ సఖి’ అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తుంది.
నాగేష్ కుకునూర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఈ నెల 28న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.
ఈ నేపథ్యంలో నిన్న రాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.ఈ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా రామ్ చరణ్ తేజ్ వచ్చారు.
ఈ వేదికపై కీర్తి సురేష్ మాట్లాడుతూ.మహానటి తర్వాత నేను సైన్ చేసిన సినిమా ఇది.ఒక సీరియస్ సినిమా చేసిన తర్వాత ఒక ఫన్ సినిమా చేయాలనీ అనిపించింది.
అలంటి సమయంలోనే ఈ కథ నా దగ్గరికి వచ్చింది.కథ వినగానే ఓకే చెప్పేసాను.చరణ్ ను ఉద్దేశించి ” మీరు గెస్ట్ గా రావడం చాలా ఆనందంగా ఉంది.
మీరు ఒక్క R తో రంగస్థలాన్ని ఒక ఊపు ఊపారు.మరి RRR ను ఎప్పుడు చూపిస్తున్నారు.?ఈ సినిమా కోసం వెయిటింగ్.అని ఆ తర్వాత నాటు నాటు స్టెప్ నాతో చేయాలి.
అది నా డ్రీమ్ అంటూ కీర్తి చరణ్ ను కోరింది.
చరణ్ కూడా అందుకు ఒప్పుకోవడంతో చరణ్ తో కలిసి ‘నాటు నాటు’ పాటకు స్టెప్పులు వేసి వేదికను సందడిగా మార్చారు.
అలాగే కీర్తి తన కోరికను కూడా తీర్చుకుంది.ఇంకా కార్తీ చిరంజీవి రానందుకు చాలా మిస్సవుతున్నాను అని ఆమె తెలిపింది.
చివరిగా ఈ సినిమాను ఈ నెల 28న విడుదల చేస్తున్నాం.మీరు తప్పకుండ చూడాలి అని తెలిపింది కీర్తి.