టాలీవుడ్ స్టార్ హీరోలైన రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు రాజమౌళి దర్శకత్వం భారీ మల్టీ స్టారర్ చిత్రంలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం గుజరాత్ లో వదోదరాలో జరుగుతుంది.
ఈ సినిమాలో హాలీవుడ్ హీరోయిన్ గా పాటు, అలియా భట్ మరో హీరోయిన్ గా చేస్తుంది.భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇద్దరు అల్లూరి, కొమరం భీం తరహా పాత్రలలో కనిపించనున్నారు.
ఇదిలా ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ గ్యాప్ లో ఈ ఇద్దరు హీరోలు కాస్తా సేదతీరుతున్నారు.
తాజాగా ఈ సినిమా షూటింగ్ లొకేషన్ లో రామ్ చరణ్, తారక్ కి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో ఎవరో షేర్ చేసారు.
షూటింగ్ లొకేషన్లో చరణ్, ఎన్టీఆర్ కలిసి ఒకే బైక్పై వెళుతున్న దృశ్యం కనిపించింది.తారక్ తన కార్వాన్ దిగే సమయానికి రామ్ చరణ్ స్కూటర్ డ్రైవ్ చేస్తూ రెడీగా ఉంటే, తారక్ తాను డ్రైవ్ చేస్తానంటూ చరణ్ను వెనక్కి వెళ్ళమని చెప్పి తను డ్రైవ్ చేస్తుంటే, చరణ్ ఎన్టీఆర్ను పట్టుకుని కూర్చున్నాడు.
ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా హల్చల్ చేస్తోంది.