ఇటీవల ప్రభాస్ తన ఫేస్ బుక్ ద్వారా సంతోష్ శోభన్ నటించిన ఏక్ మినీ కథ కు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశాడు.ఆ సమయంలోనే సినిమా తప్పకుండా విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంను వ్యక్తం చేస్తూ ప్రభాస్ ఆల్ ది బెస్ట్ చెప్పాడు.
సంతోష్ మంచి విజయాన్ని సొంతం చేసుకోవాలంటూ అభినందనలు తెలియజేశాడు.ఇదే సమయంలో ఆ సినిమాకు మంచి హైప్ వచ్చింది.
ప్రభాస్ నుండి వచ్చిన ఒక్క పోస్ట్ సినిమా గురించి అంతా ఆలోచించేలా చేశారు.ఈ వారంలో విడుదల కాబోతున్న ఏక్ మినీ కథ కు మరింత హైప్ క్రియేట్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు పలువురు ఆ సినిమా కోసం ముందుకు వస్తున్నారు.ఈసారి రామ్ చరణ్ ఆ సినిమా గురించి స్పందించాడు.
సోషల్ మీడియాలో ఆ సినిమా పై స్పందిస్తూ తప్పకుండా విజయాన్ని సొంతం చేసుకోవాలని ఆశిస్తున్నాను అంటూ శుభాకాంక్షలు తెలియజేశాడు.
సంతోష్ కు ఎందుకు ఇంత మంది శుభాకాంక్షలు చెబుతున్నారు అంటూ కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
అసలు విషయం ఏంటీ అంటే ఈ యువ హీరో తండ్రి శోభన్ డైరెక్టర్.వర్షం నుండి మొదలుకుని పలు సినిమా లను తెరకెక్కించాడు.ఆయన తెరకెక్కించిన సినిమా లు కొన్ని సూపర్ హిట్ అవ్వగా కొన్ని నిరాశ పర్చాయి.అయినా కూడా ఇండస్ట్రీ లో మాత్రం మంచి స్టార్ డమ్ ను గుర్తింపును పరిచయాలను పెంచుకున్నాడు.
అందుకే ఆయన సినిమా ల కంటే ఆయన బాగా ఫేమస్ అయ్యాడు.వర్షం సినిమా తో తనకు మంచి సక్సెస్ ను ఇచ్చినందుకు గాను ప్రభాస్ స్పందించాడు.
ఇప్పుడు చరణ్ కూడా తనకు ఉన్న పరిచయం కారణంగా స్పందించాడు.చరణ్ కూడా స్పందించడంతో ఈ సినిమా పై అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి.
తప్పకుండా ఈ సినిమా తో అతడు సక్సెస్ ను దక్కించుకుంటాడని అంటున్నారు.