మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ కోసం యావత్ తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.
కాగా ఈ సినిమాతో మరోసారి మెగాస్టార్ బాక్సాఫీస్ను చెడుగుడు ఆడటం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి.అయితే ఈ సినిమాను తొలుత దసరాకే రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది.
కానీ సినిమా షూటింగ్ విషయంలో చాలా ఆలస్యం అవుతుండటం మెగా ఫ్యాన్స్తో పాటు ప్రేక్షకుల్లో కూడా ఆందోళన మొదలైంది.అనుకున్న దానికంటే ఈ సినిమా చాలా ఆలస్యంగా తెరకెక్కుతుండటంతో ఈ సినిమా ఎందుకు అలా వెనకబడిపోతుందా అనే సందేహం అందరిలోనూ మొదలైంది.
అయితే ఈ సినిమా ఇంతగా ఆలస్యం అవుతండటానికి అసలు కారణం ఏమిటా అని ఆరా తీస్తే, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అని తెలుస్తోంది.ఈ సినిమాలో కేమియో పాత్రలో నటించడంతో పాటు ఈ సినిమాకు నిర్మాతగా ఉన్న రామ్ చరణ్, ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్నాడు.
అయితే ఆర్ఆర్ఆర్ చిత్రం ఇప్పట్లో పూర్తయ్యే అవకాశం లేకపోవడంతో చరణ్ ఈ సినిమాలో ఇప్పట్లో జాయిన్ అయ్యే సూచనలు కూడా కనిపించడం లేదు.దీంతో ఆచార్య సినిమాను వచ్చే సంక్రాంతికి కాకుండా వేసవి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.
కాగా ఈ సినిమాలో చిరు సరసన అందాల భామ కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది.మరి రామ్ చరణ్ కారణంగా ఆలస్యమైన ఆచార్య ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.