మెగా పవర్ స్టార్ రాం చరణ్ శంకర్ కాంబినేషన్ లో క్రేజీ మూవీ రాబోతున్న విషయం తెలిసిందే.దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో చరణ్ సరసన నటించే హీరోయిన్స్ ఎవరన్నది కన్ ఫ్యూజన్ ఇంకా కొనసాగుతూనే ఉంది.
ఈ సినిమాలో కథనాయికలుగా ఇద్దరు భామలు డిస్కషన్స్ లో ఉన్నట్టు తెలుస్తుంది.అందులో ఒకరు కియరా అద్వాని కాగా మరొకరు అలియా భట్.తెలుగులో మహేష్ తో భరత్ అనే నేను, చరణ్ తో వినయ విధేయ రామ సినిమాల్లో నటించింది కియరా అద్వాని.
ఈ సినిమాలో హీరోయిన్ గా మరో భామ అలియా భట్ కూడా చర్చల్లో ఉన్నట్టు తెలుస్తుంది.
బాలీవుడ్ భామ అలియా భట్ ఇప్పటికే చరణ్ తో ఆర్.ఆర్.ఆర్ సినిమాలో నటిస్తుంది.శంకర్ సినిమాలో కూడా ఈ జోడీని రిపీట్ చేయాలని చూస్తున్నారు.
కియరా, అలియా భట్ ఇద్దరి మధ్య పోటీ ఉందని తెలుస్తుంది.ఈ సినిమాలో ఎవరు ఫైనల్ హీరోయిన్ అవుతారన్నది తెలియాల్సి ఉంది.
పాన్ ఇండియా మూవీగా భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమాతో శంకర్ తిరిగి ఫాం లోకి రావాలని చూస్తున్నారు.చరణ్ కూడా ఈ సినిమాపై స్పెషల్ ఫోకస్ పెడుతున్నట్టు తెలుస్తుంది.