ఈ ఏడాది మొత్తాన్ని కరోనా వైరస్ తన సంవత్సరంగా మార్చేసుకుంది.డిసెంబర్ ఎండ్ లో మొదలైన ఈ వైరస్ ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది.
అయితే ఇండియాలో కరోనా ప్రభావం మార్చి నుంచి మొదలైంది.ఈ ఏడాదిలో మెజారిటీ కాలం లాక్ డౌన్ లోనే గడిచిపోయింది.
ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా అన్ని రంగాల వారు తమ పని కోల్పోయి ఖాళీ అయ్యారు.కేవలం కొన్ని వ్యవస్థలు మాత్రమే ఈ లాక్ డౌన్ టైంలో సమర్ధవంతంగా పనిచేశాయి.
ఇక సినిమా పరిశ్రమ గురించిప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఇదివరకు ఎన్నడూ లేనన్ని విషాదాలు, నష్టాలని చిత్ర పరిశ్రమ ఈ ఏడాది ఎదుర్కొంది.
ఎంతో మంది స్టార్స్ కళ్ళముందు నుంచి మాయమయ్యారు.టాలీవుడ్ లో గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మన మధ్య నుంచి దూరమయ్యారు.
కరోనా ఆయనని కబళించింది.కరోనా కాటుకి ప్రపంచ వ్యాప్తంగా చిత్ర పరిశ్రమకిచెందిన చాలా మంది సెలబ్రెటీలు మృత్యువాత పడ్డారు.
కొందరు కరోనా బారిన పడి కోలుకున్నారు.
ఇక తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కరోనా బారిన పడింది.
అదృష్టం కొద్ది షూటింగ్ టైంలో ఈమెకి కరోనా సోకలేదు.కరోనా బారిన పడిన కూడా రకుల్ మాత్రం కంగారు పడి హాస్పిటల్ కి వెళ్లకుండా ఇంట్లో హోమ్ క్వారంటైన్ లో ఉంటూ ట్రీట్మెంట్ తీసుకుంటుంది.
కరోనా నుంచి కోలుకునేంత వరకు గది నుంచి బయటకి కూడా రాకూడదని ఫిక్స్ అయ్యింది.అలాగే కరోనా నుంచి వేగంగా కోలుకోవడానికి యోగా, స్పెషల్ డైట్ తీసుకుంటుంది.
వీలైనంత వేగంగా కరోనా నుంచి కోలుకొని మళ్ళీ బయట ప్రపంచంలోకి వస్తానని ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా రకుల్ అభిమానులకి తెలియజేసింది.ఏది ఏమైనా కరోనా వచ్చిందని భయపడకుండా ఇంటివద్దనే జాగ్రత్తలు తీసుకుంటూ రకుల్ బయటపడటానికి చేస్తున్న ప్రయత్నం నిజంగా గొప్ప విషయం అని చెప్పాలి.