టాలీవుడ్లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా తన సత్తా చాటిన అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్, ప్రస్తుతం ఫేడవుట్ అయ్యేందుకు రెడీ అయ్యింది.ఇప్పటికే తెలుగులో ఆఫర్లు లేక సతమతమవుతున్న ఈ బ్యూటీ, యంగ్ హీరో నితిన్ సరసన నటించే అవకాశం దక్కించుకుంది.
విభిన్న చిత్రాల దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో రాబోయే ఓ సినిమాలో నటించేందుకు రకుల్ ఎంపికైంది.అయితే ఈ సినిమా తప్ప మరే ఇతర సినిమా ఛాన్సులు లేకపోవడంత రకుల్ ఢీలా పడింది.
కాగా ఒకప్పుడు స్టార్ స్టేటస్ను ఎంజాయ్ చేసిన రకుల్, తన రెమ్యునరేషన్గా రూ.1.5 కోట్లు తీసుకుంది.అయితే ఇప్పుడు అందులో సగం రెమ్యునరేషన్ తీసుకుంటానని చెప్పినా, నిర్మాతలు ఎవరూ తనకు అవకాశం ఇవ్వడం లేదని తెలుస్తోంది.
దీంతో తన రెమ్యునరేషన్ను మరింత తక్కువ చేసిందట ఈ బ్యూటీ.అయినా కూడా హీరోలు, దర్శకనిర్మాతలు ప్రస్తుతం ఆమెవైపు చూడటం లేదట.తనకు ఒక్క అవకాశం వస్తే, మళ్లీ తన పాత స్టేటస్ను దక్కించుకుంటానని ధీమా వ్యక్తం చేస్తోంది ఈ బ్యూటీ.
మరి రకుల్కు ఈసారి అవకాశం ఎవరు ఇస్తారా అనే అంశం ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.
అటు హీరోలెవరూ రకుల్తో సినిమా చేసేందుకు ఆసక్తి చూపించక పోవడమే ఆమెకు ఆఫర్లు రాకుండా చేస్తోందని చిత్ర వర్గాల టాక్.మరి నితిన్తో కలిసి నటించబోయే సినిమాతోనైనా రకుల్ తన పూర్వ వైభవాన్ని సాధిస్తుందా లేదా అనేది చూడాలి.
కాగా రకుల్ ఈసారి గ్లామర్కు కాకుండా నటనకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.