టాలీవుడ్ లో ఒక్కసారిగా ఏమర్జ్ అయ్యి స్టార్ హీరోయిన్ రేంజ్ కి దూసుకొచ్చిన నటి రకుల్ ప్రీత్ సింగ్.ఐదేళ్ళ కెరియర్ లో ఏకంగా ప్రస్తుతం ఉన్న చాలా మంది స్టార్ హీరోలతో జత కట్టిన ఈ భామ అంతే వేగంగా అవకాశాలు కోల్పోయింది.
ప్రస్తుతం రకుల్ చేతిలో ఒక చిన్న హీరో చిత్రం మాత్రమే తెలుగులో ఉంది.అయితే బాలీవుడ్ లో మాత్రం ఓ మూడు సినిమాలు లైన్ లో పెట్టింది.
ఏది ఏమైనా టాలీవుడ్ లో పెద్దగా రకుల్ కి అవకాశాలు లేవనే చెప్పాలి.కొత్త హీరోయిన్స్ దూసుకొస్తూ ఉండటంతో పాటు ప్రస్తుతం రకుల్ వదిలేసుకున్న టాప్ చైర్ కోసం పూజా హెగ్డే, రష్మిక మందన మధ్య గట్టి పోటీ నడుస్తుంది.
పూజా హెగ్డే బాలీవుడ్ మీద ఫోకస్ పెట్టడంతో రష్మిక ఆ స్థానంలోకి వచ్చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే హీరోయిన్ గా అవకాశాలు పెద్దగా లేకపోవడంతో రకుల్ పాప ఐటెం సాంగ్స్ కి సై అంటుందని టాక్ వినిపిస్తుంది.
గతంలో కాజల్, తమన్నా కూడా హీరోయిన్స్ గా డౌన్ లో ఉన్నప్పుడు ఐటెం సాంగ్స్ చేయడానికి ప్రాధాన్యత ఇచ్చారు.ఇప్పుడు కూడా చేస్తున్నారు.గ్లామర్ భామలు ఐటెం సాంగ్స్ చేస్తే భారీగా ముట్టజెప్పడానికి దర్శక, నిర్మాతలు కూడా సిద్ధంగా ఉన్నారు.ఈ నేపధ్యంలో ఆర్ఆర్ఆర్ లో ఐటెం సాంగ్ కోసం రకుల్ ని సంప్రదించారని టాక్ వినిపిస్తుంది.
అలాగే మహేష్, పరశురాం సినిమాలో ఐటెం సాంగ్ కోసం కూడా రకుల్ ని తీసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తుంది.పుష్ప సినిమా కోసం కూడా రకుల్ పేరు గట్టిగా వినిపిస్తుంది.
మొత్తానికి తాను హీరోయిన్ గా రొమాన్స్ చేసిన హీరోలతో ఇప్పుడు ఐటెం భామగా స్టెప్పులు వేయడానికి రకుల్ రెడీ అవుతుంది అనే మాట బలంగా వినిపిస్తుంది.