రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్లో యంగ్ స్టార్ హీరోలందరితో దాదాపుగా నటించేసింది.కేవలం రెండు ఏళ్ల కాలంలో ఈ అమ్మడు స్టార్ హీరోలతో రొమాన్స్ చేసింది.
అయితే ఈమె చాలా తక్కువ సమయంలోనే క్రేజ్ను కోల్పోయింది.టాలీవుడ్లో ఈమెకు సరైన అవకాశాలు లేక సంవత్సరం అయ్యింది.
దాంతో ఈమె తమిళనాట సినిమాల ఛాన్స్ వస్తే వెళ్లింది.అయితే అక్కడ చేసిన సినిమాలు ఏవీ కూడా సరైన సక్సెస్లను తీసుకు రాలేదు.
దాంతో చేసేది లేక మళ్లీ టాలీవుడ్లోనే ప్రయత్నాలు ప్రారంభించింది.పరిచయాలున్న హీరోలతో టచ్లో ఉంటూ ఆఫర్లు అడిగిన ఈ అమ్మడికి తాజాగా మెగా ఆఫర్ దక్కింది.
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తాజాగా ‘చిత్రలహరి’ చిత్రంలో నటించాడు.ఆ సినిమా విడుదల అవ్వడమే ఆలస్యం వెంటనే గీతాఆర్ట్స్ బ్యానర్లో మారుతి దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేసేందుకు ఓకే చెప్పాడు.బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రంపై సినీ వర్గాల్లో అంచనాలు భారీగా ఉన్నాయి.బన్నీ వాసు నిర్మాణంలో మారుతి దర్శకత్వంలో గతంలో వచ్చిన సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
యూత్ ఆడియన్స్ను అలరించేలా సినిమాలు చేసే దర్శకుడు మారుతి ఈసారి తేజూ కోసం ఒక మంచి విభిన్నమైన కథను తీసుకు వచ్చాడట.
ఆ కథతో మూవీని ఏప్రిల్ లేదా మేలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రంలో హీరోయిన్గా రష్మిక మందన్నను ఎంపిక చేశారు.అయితే ఆమె డేట్లు కుదరక పోవడంతో షూటింగ్ ప్రారంభంకు ముందు నో చెప్పింది.
దాంతో ఆ స్థానంలో తేజూ రికమండేషన్ మేరకు రకుల్కు ఛాన్స్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.మెగా ఛాన్స్ను దక్కించుకున్న రకుల్ ప్రీత్ సింగ్ మళ్లీ తన జోరును కొనసాగించేనా చూడాలి.