ఈ లాక్ డౌన్ టైంను స్టార్స్ ఫుల్గా వినియోగించుకుంటున్నారు.షూటింగ్స్ లేకపోవడంతో ఇతర పనులు చేస్తున్నారు.
కొందరు ఆన్ లైన్ క్లాస్లు వింటూ ఉంటే మరికొందరు ఆన్ లైన్లో కథల చర్చలు జరుపుతున్నారు.మరికొందరు చదువుకుంటూ జ్ఞానం పెంచుకుంటున్నారు.
ఈ సమయంలోనే రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఆన్ లైన్ లో పాఠాలు వింటూ ఉన్నట్లుగా ఆమె సన్నిహితుల ద్వారా గతంలోనే వెళ్లడి అయ్యింది.తాజాగా ఆ విషయాన్ని క్లారిటీ ఇచ్చింది.
షూటింగ్స్ లేని ఈ సమయంలో తాను ఎంబీఏ ను చేస్తున్నట్లుగా ప్రకటించింది.విదేశీ యూనివర్శిటీలో ఆన్ లైన్ విధానం ద్వారా ఎంబీఏ క్లాస్లు వింటున్నట్లుగా పేర్కొంది.ఆన్ లైన్లోనే పరీక్షలు కూడా నిర్వహించనున్నారు.ఆ పరీక్షల్లో పాస్ అయితే ముద్దుగుమ్మ ఎంబీఏ పట్టా పొందుతుంది.
రకుల్ ప్రీత్ సింగ్ ఈమద్య కాలంలో కాస్త సినిమాల పరంగా డల్గా ఉంది.ఇలాంటి సమయంలో ఆమె ఎంబీఏ పూర్తి చేస్తే ఆ తర్వాత మంచి వ్యాపారం అయినా చేసుకోవచ్చు అంటున్నారు.
రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పటికే జిమ్ బిజినెస్ చేస్తుంది.మరో వైపు రెస్టారెంట్ బిజినెస్ కూడా ఆమె మొదలు పెట్టే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి.ఇదే సమయంలో లాక్ డౌన్ రావడంతో ఆమె రెస్టారెంట్ బిజినెస్ వాయిదా పడినది.త్వరలోనే మళ్లీ ఆమె వ్యాపారంలో అడుగు పెట్టే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.
ప్రస్తుతం సినిమాకు చెందిన షూటింగ్స్ జరుగుతున్నాయి.కాని రకుల్ మాత్రం ఇప్పట్లో షూటింగ్స్కు హాజరు అయ్యేందుకు ఇష్టపడటం లేదు.
ఈ గ్యాప్లో ఎంబీఏ పూర్తి చేసే అవకాశం ఉందంటున్నారు.