టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో స్టార్ హీరోలతో ఆడిపాడేసి ఇప్పుడు ఫోకస్ అంతా బాలీవుడ్ మీద పెట్టింది.అక్కడ కూడా తన సత్తా చాటుకొని స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోవాలని ఆశ పడుతుంది.
అందులో భాగంగానే ఈ మధ్య పూర్తిగా తెలుగు సినిమాలు పక్కన పెట్టి బాలీవుడ్ ఏకంగా మూడు సినిమాలు ఒకే చేసింది.అందులో జాన్ అబ్రహాంతో ఎటాక్, అజయ్దేవగన్–సిద్దార్ధ్ మల్హోత్రా కాంబినేషన్ లో థ్యాంక్ గాడ్, అర్జున్ కపూర్ తో కలిసి ఓ సినిమా చేస్తుంది.
ఈ సినిమాల షెడ్యూల్స్ కి ఇబ్బంది లేకుండా వరుసగా డేట్స్ ఇచ్చింది.
అయితే ఇప్పుడు కరోనా రూపంలో సినిమా షూటింగ్ లు అన్ని బంద్ అయ్యాయి.
ఆ ఎఫెక్ట్ రకుల్ సినిమా డేట్స్ మీద పడింది.సైన్ చేసిన సినిమాల షూటింగ్స్ అనుకున్న సమయానికి జరగకపోవడం వల్ల కాల్షీట్లు క్లాష్ అవుతాయని ఇప్పుడు రకుల్ తెగ కంగారు పడుతుంది.
కరోనా వైరస్ ప్రభావం లేకపోయినట్లయితే ఈ సమయంలో ప్రతిరోజూ నేను షూటింగ్స్లో పాల్గోనేదానిని.కానీ షూటింగ్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోయాయి.
బ్రేక్ తర్వాత ఒకేసారి షూటింగ్స్ మొదలైతే నా డేట్స్ను ఎలా సర్దుబాటు చేయాలో అర్థం కావడంలేదు.నా కెరీర్లో ఇది పెద్ద బ్రేక్.
కరోనా కారణంగా ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే యుద్ధానికి వెళ్లిన ఫీలింగ్ కలుగుతోంది అని రకుల్ ప్రీత్ సింగ్ కామెంట్స్ చేసింది.