తెలంగాణ రాష్ట్రంలో నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలు జరుగనున్నాయి అనే వార్త గతకొంత కాలంగా హాట్ టాఫిక్గా మారింది.యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా సినీ నటులు, పర్యావరణ వేత్తలు, ప్రతిపక్ష పార్టీలు నిరసన తెలుపుతున్నారు.
వీరంతా యురేనియం తవ్వకాలను తీవ్రంగా తప్పుబట్టారు.నల్లమల అడవులను నరికివేస్తే ప్రకృతి అంతా అల్లకల్లోలం అవతుందని అంతా ఆందోళన వ్యక్తం చేశారు.
కాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ దీనిపై స్పందించారు.
తెలంగాణలో యురేనియం తవ్వకాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వబోదని స్పష్టం చేశారు.
దాంతో తెలంగాణ ప్రజలంతా కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.కేటీఆర్ ఇచ్చిన వివరణపై నటి రకుల్ ప్రీత్ సింగ్ స్పందించారు.
తెలంగాణ ప్రభుత్వం గొప్ప నిర్ణయం తీసుకుందని ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించింది.ఇలాంటి ప్రజాహిత నిర్ణయం తీసుకోవడంపై స్పందించిన రకుల్ సర్కార్ని గొప్ప నిర్ణయం అంటూ అభినందించింది.