స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.మిస్ ఇండియా గా ఎంపికయిన ఈ భామ తన అందంతో, గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
తను చదువుకుంటున్న వయసులోనే సినిమాల్లోకి అడుగు పెట్టి ఎన్నో అద్భుతమైన అవకాశాలను సాధించింది.అలాంటి ఈ స్టార్ హీరోయిన్ 2009 కన్నడ సినిమాతో పరిచయం అవ్వగా 2011లో తెలుగు పరిశ్రమకు పరిచయం అయ్యింది.
కన్నడలోనే కాకుండా తమిళ భాషల్లో కూడా నటించింది.22 కి పైగా సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ… ప్రభాస్ పక్కన నటించే అవకాశం కోల్పోయింది.ఎప్పుడు ? ఏ సినిమా అనుకుంటున్నారా? అదేనండి.ప్రభాస్ నటించిన మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా.
కాజల్, తాప్సి హీరోయిన్లుగా నటించి ఈ సినిమా ఎంత హిట్ అయ్యింది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
అయితే ఇటీవల వచ్చిన సమాచారం ప్రకారం అప్పట్లోనే ఆ సినిమాలో కాజల్ నటించిన పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ ను పెట్టి తీయాలనుకున్నారట నిర్మాతలు.
కానీ కొన్ని కారణాల వల్ల రకుల్ ను తీసేసారట.మొదట మిస్టర్ పర్ ఫెక్ట్ షూటింగ్ లో నాలుగు రోజులు రకుల్ ప్రీత్ తో చేయించారు.
కానీ అప్పటికి డిగ్రీ పరీక్షలు జరుగుతుండటంతో షూటింగ్ సమయంలో కూడా చదువుతూ ఉండేదట రకుల్.
తనకు సినిమాల గురించి పెద్దగా పరిచయం లేనందున సినిమాల్లో నటించడానికి రిస్క్ అని.అందుకే ఇంతకుముందు కాజల్, ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన డార్లింగ్ హిట్ కూడా అవ్వడం వల్ల మళ్లీ అదే జంటతో తీయాలని నిర్మాతలు నిర్ణయం తీసుకోవడంతో ఆమెని తీసేసినట్టు రకుల్ ప్రీత్ సింగ్ తెలిపింది.అంతేకాదు మరో సినిమా కూడా రకుల్ ను తప్పించింది.
ఆటోనగర్ సూర్య సమంతకు ఖాళీ లేనందున రకుల్ ని తీసుకోగా… తర్వాత సమంతకు డేట్స్ అవకాశం రాగా రకుల్ ను తీసేశారు.తనకు ఈ సినిమానే వల్లే సినిమా విలువ తెలిసి వచ్చిందని రకుల్ కొన్ని సందర్భాలలో తెలిపింది.