కరోనా రోగుల కోసం విరాళాలు సేకరిస్తున్న రకుల్..!

సౌత్ ఇండియన్ హాట్ బ్యూటీ పంజాబీ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు ప్రజలకు సుపరిచితమే.ఈ అమ్మడు దాదాపు టాలీవుడ్ స్టార్ హీరోలందరితో సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకుంది.

 Rakul Preet Starts Fundraiser To Help Covid Patients, Rakul Preet Singh, Give In-TeluguStop.com

కానీ గత కొన్ని రోజులుగా ఈ అమ్మడు చేసిన సినిమాలు ప్లాప్ అవ్వడంతో స్టార్ హీరోల సరసన అవకాశాలు తగ్గి పోయాయి.దీంతో ఈ అమ్మడు ఇప్పుడు కుర్ర హీరోల సరసన ఆడి పడుతుంది.
తాజాగా ఈ బ్యూటీ నితిన్ చెక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది.కానీ ఈ సినిమా కూడా ఈ అమ్మడికి కలిసి రాలేదు.రకుల్ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.ప్రస్తుతం ఈ అమ్మడు మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ సరసన నటిస్తుంది.

క్రిష్ దర్శకత్వం వహిస్తున్న కొండపొలం సినిమాలో రకుల్ హీరోయిన్ గా నటిస్తుంది.
ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తుంది.

పరిస్థితులు చెక్కబడిన తర్వాత ఈ సినిమా విడుదల చేయబోతున్నారు.ఈ అమ్మడికి ప్రస్తుతం తెలుగులో అవకాశాలు లేకపోయినా బాలీవుడ్ లో మాత్రం వరుస ఆఫర్లు వస్తున్నాయి.

ఇది ఇలా ఉండగా ప్రస్తుతం ఈ అమ్మడు కరోనా సెకండ్ వేవ్ పరిస్థితుల దృష్ట్యా కరోనా రోగుల కోసం విరాళాలు సేకరించే పనిలో పడ్డారు.
కరోనా కారణంగా ఎంతో మంది ప్రజలు హాస్పిటల్ పాలవుతున్నారు.

ఈ నేపథ్యంలో హాస్పటల్ లో ఆక్సిజెన్, ఇతర వైద్య పరికరాల కొరత ఏర్పడుతుంది.అందుకే రకుల్ ప్రీత్ గివ్ ఇండియా పేరుతో విరాళాలు సేకరించి ప్రజలకు అండగా నిలవాలని అనుకుంటున్నారు.

అందుకే ఈమె ప్రజలకు తమవంతు సాయం చేయాలనీ సూచిస్తుంది.మీరు అందించే చిన్న మొత్తం కూడా చాలా మందికి సహాయ పడుతుందని రకుల్ తెలుపుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube